అవతలి వ్యక్తికి ధైర్యం ఉంటే నేను రెడీ.. మెగాస్టార్‌తో మల్టీస్టారర్‌పై బాలకృష్ణ హింట్!

ఒకప్పటితో పోల్చితే ప్రేక్షకుల ధోరణి, అభిరుచుల్లో మార్పు వచ్చింది. రాను రాను మల్టీస్టారర్ సినిమాలకు ఆదరణ రెట్టింపవుతోంది. ఇద్దరు స్టార్స్ ఒకే తెరపై ఎంటర్‌టైన్ చేయడాన్ని స్వాగతిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పటికే సీనియర్ హీరోలైన వెంకటేష్, నాగార్జున మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ముందుకు రాగా.. ఇప్పుడు మరో సీనియర్ స్టార్ హీరో, నందమూరి నటిసింహం మల్టీస్టారర్ మూవీపై మనసుపడ్డారు. ఆయన లేటెస్ట్ మూవీ అఖండ సక్సెస్ తర్వాత విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న బాలకృష్ణ.. ఈ మూవీ విజయంపై ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ మల్టీస్టారర్ మూవీ విషయమై రియాక్ట్ అయ్యారు. మంచి కథ దొరికితే మల్టీస్టారర్ మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే అది ఏ హీరోతో అనేది మాత్రం చెప్పని బాలకృష్ణ.. అవతలి వ్యక్తికి ధైర్యం ఉంటే తాను రెడీ అని చెప్పడం విశేషం. అయితే బాలయ్య బాబు ఇలా మల్టీస్టారర్ మూవీ ప్రస్తావన తీసుకురావడంతో మరోసారి చిరంజీవి- ఇష్యూ తెరపైకి వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు బాలకృష్ణ, కాంబోలో భారీ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని, ఈ ఇద్దరి కాంబోలో ఓ భారీ సినిమా రాబోతుందన్న వార్తలకు బలం చేకూరింది. దీనిపైనే బాలకృష్ణ ఇప్పుడు హింట్ ఇచ్చారని ప్రేక్షకలోకం చెప్పుకుంటోంది. ఇక బాలకృష్ణ అఖండ సినిమా విషయానికొస్తే.. కరోనా పరిస్థితుల తర్వాత భారీ విజయం అందుకొని అటు నిర్మాతల్లో ఇటు ప్రేక్షకుల్లో నూతనోత్సాహం నింపింది ఈ సినిమా. బాలకృష్ణ- ప్రగ్యా జైస్వాల్ జంటగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమాకు నీరాజనం పడుతున్నారు తెలుగు ప్రేక్షకులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33AAHPL

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts