కమ్మ వాళ్లని కాల్చిపారేయండి.. ఎందుకీ దరిద్రం: జగన్‌ ప్రభుత్వంపై తమ్మారెడ్డి తీవ్ర ఆగ్రహం

టికెట్ రేట్ల ఇష్యూలో ఏపీ ప్రభుత్వం కమ్మ సామాజికి వర్గానికి చెందిన వాళ్లని టార్గెట్ చేసిందంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు తమ్మారెడ్డి. ఎమ్మెల్యే ఏమన్నారు? తమ్మారెడ్డి కౌంటర్ ఏంటి?? ‘‘ఏపీలో ఒక ముఖ్యమంత్రి ఉన్నారనేది గుర్తుందా.. తెలంగాణలో ఉండి అక్కడ సినిమాలు తీస్తున్న సినీ హీరోలు కోట్లకు కొట్లు సంపాదిస్తున్నారు.. సినిమా హీరోలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.. టికెట్ రేటు తగ్గించి పేదవాడు సినిమా చూసేలా చేయడం తప్పా.. సినిమాలో ఉన్న పెద్దలంతా చంద్రబాబు మనుషులే.. సినిమా వాళ్లు ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నారు’ అంటూ మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి . ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఛానల్ చర్చలో పాల్గొన్నారు తమ్మారెడ్డి. కరుడుకట్టిన టీడీపీ జర్నలిస్ట్‌గా పేరొందిన ప్రముఖ యాంకర్ తమ్మారెడ్డిని వివాదంలోకి లాగే ప్రయత్నం చేయడంతో.. తమ్మారెడ్డి రెచ్చిపోయారు. ఇగో, ఫ్రస్ట్రేషన్ వల్లే ఈ టికెట్ రేట్ల ఇష్యూని తెరపైకి తెచ్చిందనే అనుకోవాలి కదా.. కాళ్లబేరానికి రావాలనే ఇలా చేశారు కదా? అని ఆ యాంకర్ అనడంతో.. ‘అంతే అనుకోవాలి’ అంటూ మొదలుపెట్టిన తమ్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ ఆ ఎమ్మెల్యే మాట్లాడిన దాంట్లో నాకు అర్ధం కానిది ఏంటంటే.. టికెట్ రేట్లు ఎక్కువ పెట్టి సినిమా వాళ్లు డబ్బు సంపాదిస్తున్నారని అన్నాడు. పేదలకు న్యాయం చేస్తున్నాం అంటున్నాడు. అది నిజమే.. మేం తప్పు చేశాం.. ఇప్పుడు వాళ్లు ఆ తప్పుని సరిదిద్దుతారా? లేదా? నేను దొంగతనం చేస్తే చేయకూడదని చెప్పి దాన్ని సరిదిద్దడానికి చూడాలి తప్పితే.. చేశావ్ అని చెప్పడం వల్ల ఏం ఉపయోగం. రెండోది.. ముఖ్యమంత్రి ఉన్నాడని మీకు గుర్తుందా? అంటున్నారు.. జగనే కాదు.. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా మాకు ముఖ్యమంత్రి ఉన్నాడని తెలియదు.. చంద్రబాబు ఉన్నప్పుడు ఎవరైనా వెళ్లారా? చంద్రబాబుని కలిశారా? ఆయన ఉన్న ఐదేళ్లలో ఎవరైనా ఇండస్ట్రీ తరుపున వెళ్లి కలిశారా? లెక్కలు తీయమనండి.. ఎవరూ వెళ్లి కలవలేదు.. ఇప్పుడు వీళ్లకి ఎందుకంత అక్కసు? ఎందుకు వెళ్లి కలవాలి? మూడోది ఏపీలో షూటింగ్‌లు చేస్తున్నారా? అంటున్నారు.. చంద్రబాబు కానీ.. జగన్ కానీ వీళ్లెవరూ అధికారంలోకి రాకముందు నుంచే.. 30 శాతం సినిమా షూటింగ్‌లు ఏపీలోనే చేస్తున్నాం.. వాళ్లకి ఈ విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు. రాజమండ్రి, వైజాగ్, భీమిలిలో రెగ్యులర్ షూటింగ్‌లు ఉంటాయి. ఇవి కాకుండా వైజాగ్‌లోని రామానాయుడు స్టుడియోలో బెంగాలీ, ఒడియా షూటింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్‌లో బలిసిపోయి కూర్చున్నారని అంటున్నారు.. ఎవరు బలిసి కూర్చున్నారో చెప్పమనండి. మొత్తం ఇండస్ట్రీలో ఉన్న అందరి ఆస్తి.. వీళ్ల ఒక్క ఎమ్మెల్యే ఆస్తితో సమానంగా ఉంటుంది. అప్పుడు తేలిపోద్ది.. బలుపు రాజకీయ నాయకులకు ఉందో.. సినిమా వాళ్లకి ఉందో అర్ధమైపోతుంది. ఊరికే నోరు ఉందని కదా బలుపు, తొక్క, తోటకూర అంటే బూతులు ఎదుటివాళ్లు కూడా మాట్లాడగలరు. అసెంబ్లీని ఎట్టాగూ నాశనం చేశారు.. టీవీలను ఎందుకు నాశనం చేస్తున్నారు.. అన్నిపార్టీల వాళ్లు బూతులు తిట్టుకుంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడే మాటలు ఇవేనా? సినిమా టికెట్‌ల లెక్కలు చెప్తున్నారు.. మరి జనం డబ్బుతో నడిపిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు ఎంత ఖర్చు అవుతుంది.. అక్కడకు వెళ్లి వీళ్లు మాట్లాడే మాటలు ఏంటి..? బూతులు తిట్టుకోవడానికేనా? అసెంబ్లీ సమావేశాలు? నిమిషానికి ఎంత డబ్బు ఖర్చుఅవుతుంది. ఈరోజు పండక్కి ఆర్టీసీ టికెట్ రేట్లు ఎందుకు పెంచారు? జనం కోసం అనుకుంటే.. అవసరానికి ధరలు తగ్గించాలి కదా.. ప్రైవేటు చార్జీలు పెంచినప్పుడు వీళ్లూ పెంచితే వాళ్లకి వీళ్లకి తేడా ఏముంది? అని అన్నారు తమ్మారెడ్డి. ఇంతలో ఆ యాంకర్ మరింత రెచ్చగొడుతూ.. వీళ్లు ఏ ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారంటే.. ప్రతి వాడు మమ్మల్ని గుర్తించాలి.. మా దగ్గర సాగిలపడాలి.. రెండోది కులం.. ఆ కమ్మ కులం వాళ్లని దెబ్బకొట్టాలి అని అనడంతో.. తమ్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కమ్మకులంపై దొబ్బుదేలు ఉంటే కాల్చిపారదొబ్బండి అందర్నీ.. ఒకేసారి పోతారు.. తొక్కలోది 8 పర్సంట్ కూడా లేదు.. కాల్చిపారేయండి.. అందరూ ఒకేసారి పోతారు. మహా అయితే లక్షల్లోనే ఉంటారు.. వీళ్లతో రోజూ తిట్లు తినేకంటే.. ఒకేసారి పోవడం మంచిది కదా.. ఎందుకు రోజూ ఈ దరిద్రం’ అంటూ చెలరేగిపోయారు తమ్మారెడ్డి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3JZq3T3

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts