
సాధారణంగా బుల్లి తెర, వెండి తెరపై నటిగా మెరిసి పోవాలని కావాల్సినంత గుర్తింపు రావాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం తనను తాను ఆసహ్యించుకుందట. ఆ విషయాన్ని ఎవరో కాదు.. ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. అవికా గోర్. ఈమె బాలికా వధు అనే సీరియల్ ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ సీరియల్ సక్సెస్ కావడంతో దీన్ని చిన్నారి పెళ్లి కూతురు పేరుతో డబ్బింగ్ చేసి తెలుగులోనూ ప్రసారం చేశారు. ఇక్కడ కూడా ఆ సీరియల్ మంచి ఆదరణను దక్కించుకోగా అవికా గోర్కు మంచి పేరు వచ్చింది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గురించి మాట్లాడుతూ ఆ సీరియల్ చేసే సమయంలో తానంత హ్యాపీగా లేనని, పలు సందర్భాల్లో తనని తాను ఆసహ్యించుకున్నా అని తెలియజేసింది. అంతే కాదండోయ్ స్క్రీన్పై చక్కగా కనిపిస్తున్నానా..లేదా? అనే విషయాన్ని కూడా పట్టిచుకునే దాన్ని కానని ఆమె తెలియజేసింది. తర్వాత ఈమె ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పకలరించింది. ఆ సినిమా చాలా పెద్ద హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే గ్లామర్ రోల్స్కు ఆమె నో చెప్పడమో ఏమో కానీ.. కొన్ని సినిమాల్లో నటించింది. అదే సమయంలో ఫిల్మ్ కోర్సు చేయడానికి ఆమె కొన్ని రోజులు సినిమాలకు కూడా దూరమైంది. అదే సమయంలో చబ్బీగా ఉండే ఆమె బరువు తగ్గి కాస్త సన్నబడింది. రాజుగారిగది 3 చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు పలకరించారు అవికాగోర్. సామాజిక కార్యకర్త, ఎన్జీఓను నిర్వహిస్తున్న మిలింద్ చంద్వానీతో అవికా గోర్ ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో తెలియజేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో తాను లేనని అవికా గోర్ చెప్పింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7ajKBuri9
No comments:
Post a Comment