సెలబ్రిటీ కపుల్స్ విడాకులపై ఆర్జీవీ వరుస ట్వీట్స్.. తెలివైన వ్యక్తులు చేసే పని అదేనంటూ దుమారం

కోలీవుడ్ హీరో ధ‌నుష్‌, త‌మిళ సూప‌ర్ స్టార్ కుమార్తె ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ తమ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు ఇచ్చిన ప్రకటనతో యావత్ సినీ లోకం ఆశ్చర్యపోయింది. అధికారికంగా తామిద్దరం విడిపోతున్నామని పేర్కొంటూ త‌మ త‌మ అధికారిక‌ సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు ధనుష్, ఐశ్వర్య. 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతూ ఈ ఇద్దరూ చేసిన ప్రకటనతో సెలబ్రిటీ కపుల్ బ్రేకప్స్‌పై జనాల్లో చర్చలు ముదిరాయి. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ కపుల్స్ విడిపోతున్నారనే ప్రకటన కామన్ అయింది. ఎప్పుడు ఏ జంట ఎలా బ్రేకప్ చెప్పేది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. సినీ ఇండస్ట్రీలో కొన్ని వివాహ బంధాలు ఇలా ముడిపడి అలా తెగిపోతుండటం చూస్తున్నాం. ఇలాంటి సిచుయేషన్‌లో ధనుష్- ఐశ్వర్య విడాకుల ప్రకటన రావడంతో ఈ ఇష్యూపై వివాదస్పద దర్శకుడు రియాక్ట్ అయ్యారు. ఎప్పటిలాగే తనదైన కోణంలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్లి అనేదే పెద్ద ప్రమాదం అని యువత గుర్తించడానికి స్టార్ విడాకులు ట్రెండ్ సెట్టర్స్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఓపెన్ అయ్యారు. ప్రేమ హత్యకు కారణమే పెళ్లి.. మ్యారేజ్ అనే జైలుకు వెళ్లకుండా ప్రేమించుకుంటూ ఉండడటమే ఆనంద రహస్యం అని మరో ట్వీట్ పెట్టారు . అంతటితో ఆగక 'స్మార్ట్ పీపుల్ ప్రేమిస్తారు.. తెలివి తక్కువ వారు పెళ్లి చేసుకుంటారు' అంటూ పెళ్లి గురించి వర్మ చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ వాడుతుండటంతో పాటు నెటిజన్ల నుంచి భిన్నరకాలైన స్పందన రాబడుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tBQ1Gw

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts