'పుష్ప' మూవీలో హైలైట్ పాయింట్ అదే! గతంలో ఎన్నడూ చూడని విధంగా కళ్ళు చెదిరే సీన్స్

స్టైలిష్ స్టార్ '' సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మాస్ లుక్‌లో వెండితెరపై బన్నీని చూడాలని కుతూహల పడుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటకొస్తున్న అప్‌డేట్స్ మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 'పుష్ప'లో గతంలో ఎన్నడూ చూడని విధంగా కళ్ళు చెదిరే సీన్స్ ప్లాన్ చేశారని, ఇందుకోసం సుకుమార్ తన క్రియేటివిటీకి పదును పెట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రానికే హైలైట్ కాబోయే ఓ సీన్‌పై డిస్కషన్స్ మొదలయ్యాయి. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు సుకుమార్. పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టి షూట్ చేస్తున్నారట. అయితే పుష్పరాజ్‌తో మతిపోగొట్టే ప్లాన్ చేసిన ఆయన ఈ సన్నివేశాలను కళ్ళు చెదిరే విధంగా వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నారట. మొత్తం మూవీలో ఇదే హైలైట్ అయ్యేలా చూసుకుంటున్నారట. థియేటర్లో ప్రేక్షకులు థ్రిల్‌ అయ్యేలా ఈ సీన్స్ ఉండనున్నాయట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ రోల్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కానుందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ కాగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. తిరిగి లాక్ డౌన్ ఎత్తివేయడంతో అతిత్వరలో మిగిలిన భాగం కంప్లీట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట సుకుమార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zINeMw

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts