టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లి బాట పట్టారు. లాక్ డౌన్ వేళ ఒక్కొక్కరుగా బాజా బజంత్రీ మోగిస్తున్నారు. షూటింగ్స్ లేక ఫ్రీగా ఉండటంతో పెళ్లి తంతు ముగించేస్తున్నారు. అయితే యంగ్ హీరోయిన్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి చేసుకొని సెట్ అవుదామనుకునే లోపే లాక్ డౌన్ అమలులోకి రావడంతో పెళ్లి వాయిదా వేసుకుంది. పరిస్థితులన్నీ చక్కబడ్డాకనే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది. దీంతో దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడింది. ఎలాగూ పెళ్లికి కాస్త సమయం తీసుకుంటోంది కాబట్టి ఈ లోగా తమ తమ సినిమా షూటింగ్స్ భాగం చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో సీనియర్ హీరో బాలయ్య బాబుతో రొమాన్స్ చేసే అవకాశం ఆమెకు వచ్చిందట. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో ఓ భారీ రేంజ్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ విషయమై చాలా రోజుల క్రితమే వేట ప్రారంభించారు డైరెక్టర్. శృతి హాసన్, త్రిష లాంటి హీరోయిన్స్ అనుకున్నా.. అది కుదరకపోవడంతో మెహ్రీన్కి ఆ ఆఫర్ ఇచ్చారట. ప్రస్తుతం మెహ్రీన్ ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తోంది. అలాగే రీసెంట్గా మారుతి-సంతోష్ శోభన్ సినిమా ఒప్పుకుంది. ఇక ఇప్పుడు బాలయ్య సరసన నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడు ఓకే చేసినట్లు సమాచారం. ఈ రోల్ కోసం రెమ్మ్యూనరేషన్ కూడా బాగానే ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఇకపోతే నిజ జీవిత సంఘటనలతో మాస్ ఆడియన్స్కి పిచ్చెక్కిపోయే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందించాలని గోపీచంద్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో మాస్ పోలీస్ ఆఫీసర్గా, ఫ్యాక్షనిస్ట్గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుండటం సినిమాపై ఆసక్తి పెంచేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vEg0KN
No comments:
Post a Comment