మాస్ మహారాజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘క్రాక్’. వరుస ప్లాఫుల్లో ఉన్న ... తనకు డాన్ శీను, బలుపు.. లాంటి హిట్లు అందించిన గోపీచంద్పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా బ్రేకులు పడ్డాయి. 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తుండగా ఓ తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ సంస్థ షాకిచ్చింది. Also Read: అసలు విషయానికొస్తే... ‘క్రాక్’ సినిమా విడుదల ఆపేయాలంటూ ఓ తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందట. ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధు తమిళంలో విశాల్ హీరోగా ‘టెంపర్’ మూవీని రీమేక్ చేశాడు. అయితే ఆశించినంత విజయం సాధించలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్ల నష్టపోయారు. నష్టాలను తాను భరిస్తానని ఠాగూర్ మధు ముందుగా డిస్ట్రిబ్యూటర్లకు అగ్రిమెంట్ రాసిచ్చారట. తమకు న్యాయం జరిగేవరకు మధు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘క్రాక్’ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని ఆ డిస్ట్రిబ్యూటర్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించిందట. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fw3Xci
No comments:
Post a Comment