‘సర్కారు వారి పాట’ ఇంటర్వెల్ అదిరిపోతుందట.. ఫ్యాన్స్‌కి పూనకాలే

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. కథ రీత్యా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుండటంతో యూనిట్ అందుకు సన్నాహాలు చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ‘మహానటి’ కీర్తి సురేష్‌ కథానాయిక. బ్యాంకిగ్ రంగంలో జరిగే ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న నటిస్తున్న తర్వాత సినిమా కావడం, ‘గీత గోవిందం’తో ఇండస్ట్రీని ఆకట్టుకున్న డైరెక్టర్ కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో మహేశ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను మెప్పించేలా పరశురామ్ స్ర్కిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇటీవల మహేశ్ నుంచి వస్తున్న సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక కోణాలను టచ్ చేస్తున్నాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఈ సినిమాలన్నీ వినోదంతో పాటు సామాజిక బాధ్యతలను గుర్తుచేస్తూ తెరకెక్కినవే. దీంతో ప్రేక్షకులు మహేశ్‌ నుంచి అంతకు మించి ఆశిస్తుంటారు. మహేష్‌ సూచన మేరకు పరశురామ్ అనేక అంశాలను కథలో జోడించి స్క్రిప్ట్ పక్కాగా డిజైన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా సినిమా ఇంటర్వెల్‌ సీన్ థియేటర్‌ దద్దరిల్లేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ సినిమాల్లో ‘ఒక్కడు’ సినిమా ఇంటర్వెల్ సీన్ ది బెస్ట్‌గా ఇప్పటికీ చెప్పుకుంటారు. దీంతో దానికి మించేలా ‘సర్కారు వారి పాట’ ఇంటర్వెల్‌ సీన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33dUT6R

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts