చూసీ చూడంగానే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హీరో శివ కందుకూరి. నిర్మాత రాజ్ కందుకూరి తనయుడే శివ. అయితే మొదటి సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా వరుసబెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు సెట్స్ మీదు రెండు మూడు ప్రాజెక్ట్లున్నాయట. అందులో అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. డిసెంబర్ 10న ఈ సినిమా రాబోతోంది. లేడీ డైరెక్టర్ సుజనా రావు గమనం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్పుకొచ్చాడు. మనుచరిత్ర షూటింగ్లో ఉండగా.. సుజనా రావు ఈ కథను చెప్పేందుకు వచ్చారట. డైరెక్టర్కి, తనకి ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నాడని అలా ఈ కథ తన వద్దకు వచ్చిందని చెప్పుకొచ్చాడు. కథ విన్న వెంటనే చాలా నచ్చిందని, కానీ కథ విన్నప్పుడు ఒకే చెప్పనప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, నిర్మాణ సంస్థల గురించి సమాచారం లేదని అన్నాడు. చారుహాసన్ వంటి సీనియర్ నటుడు, జ్ఞానశేఖర్ వి.ఎస్ నిర్మాత, కెమెరామెన్గా, ఇళయారాజా సంగీతాన్ని అందిస్తున్నారని తెలిశాక అది బోనస్ అనిపించిందంటూ శివ అన్నాడు. ఇక ఇళయరాజాతో పని చేయడం గురించి శివ ఎమోషనల్ అయ్యాడు. అసలు అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదంటూ శివ చెప్పుకొచ్చాడు. మా జనరేషన్ యాక్టర్స్కు ఇళయరాజాతో పని చేసే అవకాశం వస్తుందని ఎలా అనుకుంటాం.. అసలు నాకు ఆ ఆలోచన కూడా లేదు.. నా మైండ్లో కూడా అలాంటిది లేదు. కానీ మా సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారని తెలియడంతో ఆనందం వేసిందని అన్నాడు. ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతంతో సినిమా మరోస్థాయికి వెళ్లిందని అన్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pzh2ad
No comments:
Post a Comment