
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న ఓ అంశాన్ని భుజానికెత్తుకొని రంగంలోకి దిగబోతున్నారట మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు త్వరలో తెలంగాణ సీఎంతో భేటీ కాబోతున్నారట.

తెలుగు సినీ లోకంలో MAA పేరిట పెద్ద రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిసారి జరుగుతున్న 'మా' ఎన్నికలు రాజకీయ వేడిని తలపిస్తున్నాయి. ఓ రేంజ్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడం, విమర్శలు తీవ్ర స్థాయికి చేరడం చూస్తూ వస్తున్నాం. ఎప్పటిలాగే ఈ సారి కూడా అదే వాతావరణం కనిపిస్తోంది. సెప్టెంబర్లో జరగాల్సి ఉన్న 'మా' ఎలక్షన్స్ కోసం ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ప్రకటించగా, మంచు విష్ణు, హేమ, సీవీల్ నరసింహారావు తమ తమ పోటీలను కన్ఫమ్ చేశారు. ఈ పరిస్థితుల నడుమ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం కేసీఆర్ని కలవబోతున్నారనే ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న ఓ అంశాన్ని భుజానికెత్తుకొని రంగంలోకి దిగబోతున్నారట చిరు. ఈ మేరకు ఆయన ఓ నిర్ణయానికి వచ్చారని, ఆ దిశగా అడుగులేస్తున్నారని ఫిలిం నగర్లో టాక్ మొదలైంది.
MAA ఎలక్షన్స్.. అదే ఎజెండా

ప్రస్తుత 'మా' ప్రెసిడెంట్ నరేష్, ఆయన ప్యానెల్ పదవీకాలం పూర్తి కాకుండానే ఈ సారి ఎన్నికల వ్యవహారం తెరమీదకు రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. రెండు మూడు నెలల ముందే, అది కూడా ఎన్నికల ప్రకటన రాకముందే ఇంత హడావిడి చేయడాన్ని అటు ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేష్, ఇతర సీనియర్ నటులు కొందరు తప్పుబడుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా 'మా' సభ్యుల సంక్షేమంతో పాటు 'మా' కోసం సొంత భవనం నిర్మించడమే అని ఇప్పటిదాకా జరిగిన ప్రెస్ మీట్స్ చూస్తుంటే అర్థమవుతోంది.
ప్రకాష్ రాజ్ అలా.. మంచి విష్ణు ఇలా!

'మా' బరిలోకి దిగుతున్నానని ప్రకటించిన ప్రకాష్ రాజ్.. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి 'మా' కోసం సొంత భవన నిర్మాణానికై కృషి చేస్తానని చెప్పడం జరిగింది. ఆయనపై మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయని, మెగా అండదండలతో ఆయన రంగంలోకి దిగారని అంటున్నారు. ఇంతలో తన తండ్రి మోహన్ బాబుతో వెంట పెట్టుకొని సూపర్ స్టార్ కృష్ణను మీట్ అయిన మంచు విష్ణు.. ఆ వెంటనే తన పోటీని ఖరారు చేసేశారు. ‘మా’ బిల్డింగ్ ఫండ్కి తన కుటుంబం తరఫున నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం అందిస్తానని ఇదివరకే మాటిచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఇక జీవిత విషయమై ఇంకా అధికారిక సమాచారం బయటకు రాలేదు.
రంగంలోకి చిరంజీవి

అయితే గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్కి సంబంధించిన కీలక విషయాల్లో అన్నీ తానై చూసుకుంటున్న చిరంజీవి ఈ పరిస్థితులు చూసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్ మొదలైంది. 'మా' అసోసియేషన్ బిల్డింగ్ బాధ్యతలను భుజానికెత్తుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారట. 'మా' ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారు అనే విషయాలను పక్కన పెడితే.. బిల్డింగ్ పూర్తి చేసే పనిని మాత్రం చిరంజీవి బాధ్యతగా తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే అందుకోసం మెగాస్టార్ ప్రయత్నాలు షురూ అయ్యాయని అంటున్నారు.
సీఎంతో మీట్! ఇండస్ట్రీలో చర్చలు

'మా' బిల్డింగ్ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్తో చర్చించాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సీఎంతో భేటీ అయి 'మా' బిల్డింగ్ విషయమై అన్ని విషయాలు మాట్లాడనున్నారట చిరంజీవి. స్థలం కేటాయింపుపై ప్రభుత్వ ఉద్దేశం తెలుసుకొని, ఒకవేళ గవర్నమెంట్ సిద్ధంగా లేకపోతే దీని కోసం కమిటీ ఏర్పాటు చేసి 'మా' సొంత బిల్డింగ్ కోసం ఎంత ఖర్చు అవుతుంది? ఫండ్స్ ఎలా కలెక్ట్ చేయాలి అనే అంశంపై ఆయన ఫోకస్ పెట్టబోతున్నారంటూ ఇండస్ట్రీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. సో.. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AdzSIe
No comments:
Post a Comment