ప్రియాంక చోప్రా: నా తండ్రి నీడను పెళ్లి చేసుకున్నాను

గ్లోబల్ స్టార్ పెళ్లి బాలీవుడ్‌లోనే అతిపెద్ద ఈవెంట్‌గా జరిగింది. ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాంతో తనకంటే పదేళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి ప్రియాంకకు సిగ్గు లేదు అంటూ చాలా మంది ఆమెను ఆడిపోసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి బాండింగ్‌ను చూసి ఎగతాళి చేసినవారే చూడముచ్చటైన జంట అంటూ మెచ్చుకున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రియాంక ఇటీవల ముంబయి వచ్చారు. తాను నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా ప్రచార కార్యక్రమం వచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి మాట్లాడారు. ‘నాకు పెళ్లి అనగానే.. మా అమ్మానాన్నలే గుర్తొస్తారు. చెప్పాలంటే నేను పెళ్లి చేసుకోవడానికి కారణం నా తల్లిదండ్రులే. వారి వైవాహిక జీవితం, ఇద్దరి మధ్య అనుబంధం ఎంతో చూడముచ్చటగా ఉండేది. ప్రేమను పంచడంలో నిక్‌ది మా నాన్న మనస్తత్వమే. ప్రతి విషయంలో నాకే ఇంపార్టెన్స్ ఇస్తాడు. నా గురించి నాకంటే ఎక్కువగా ఆలోచిస్తారు. జీవిత భాగస్వామిలో ఇంతకు మించిన క్వాలిటీ మరొకటి ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే నేను నా తండ్రి నీడ (నిక్)ను పెళ్లి చేసుకున్నాను. మా అమ్మానాన్న ఒకర్నొకరు ఎంతగా గౌరవించుకునేవారో నేను నిక్ కూడా అంతే. ఉదయం లేవగానే నాకోసం ఆలోచించడానికి ఓ వ్యక్తి ఉన్నాడన్న ఆలోచన ఎంతో హాయినిస్తుంది. ఎంత చేసినా ఎంత సంపాదించినా చివరికి జీవితంలో కావాల్సింది ఇలాంటి వ్యక్తే కదా’ అని వెల్లడించారు ప్రియాంక. 2018లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మెట్ గాలా అనే వేడుకలో నిక్, ప్రియాంక ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రియాంక అందానికి నిక్ ముగ్దుడైపోయాడు. అప్పుడే ఆమెకు తన ప్రేమ విషయం చెప్పాలనుకున్నాడు. ప్రియాంక నెంబర్ తెలుసుకుని ఆమెకు మెసేజ్ చేశాడు. ప్రియాంకకు కూడా నిక్ అంటే ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా కలిసిపోయారు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి్కి ఒప్పించారు. అలా ముంబయిలోని ప్రియాంక నివాసంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోటలో కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. త్వరలో లాస్ ఏంజెల్స్‌లో ఓ ఇల్లు కొనుక్కోవాలని ప్రియాంక, నిక్ అనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఒకానొక సందర్భంలో ప్రియాంక వెల్లడించారు. ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం ఓ ఇల్లు కొనుక్కోవడం, దేవుడు దయ తలిస్తే పిల్లల్ని కనడం అని ప్రియాంక తెలిపారు. తన భర్తతో కలిసి అమెరికాలోనే స్థిరపడిపోయారు ప్రియాంక. అందుకే హిందీ సినిమాలకు కూడా ఎక్కువగా సంతకం చేయడంలేదు. కుదిరితే ఏడాదికి ఒక హిందీ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రియాంక కథానాయికగా నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ఫర్హాన్ అక్తర్ కథానాయకుడిగా నటించారు. ‘దంగల్’ ఫేం జైరా వాసిం కీలక పాత్రను పోషించారు. షొనాలీ బోస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2n3CE1K

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts