జనగణమనపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. చివరకు ఇలా ఫిక్సయ్యారట!

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కిన డాషింగ్ డైరెక్టర్ ప్రస్తుతం 'లైగర్' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ వర్క్స్ చివరిదశకు చేరుకోవడంతో ఈ గ్యాప్ లోనే '' కూడా ఫినిష్ చేసేయాలని పూరి జగన్నాథ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. వేగంగా సినిమాలు ఫినిష్ చేయడంలో పూరి జగన్నాథ్ ముందువరుసలో ఉంటారు. అనుకోవాలి గానీ రెండు మూడు నెలల్లో కూడా పూర్తి చేయగల సత్తా పూరీది. గతంలో 'బిజినెస్ మెన్' సినిమాను ఇలాగే రెండు నెలల్లోపే ఫినిష్ చేసి ఆశ్చర్యపరిచారు. అదే ఫార్ములాతో ఇప్పుడు 'జనగణమన' మూవీ విషయంలో కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారట. 'జనగణమన' అనేది డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చాలా కాలంగా వింటూనే ఉన్నాం. ఈ సినిమాను మహేష్ బాబుతో చేయాలని భావించిన పూరి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో అనుకున్నారు. కానీ చివరకు విజయ్ దేవరకొండకు ఈ స్టోరీ వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని తెలిసింది. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. 'లైగర్' సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఆ లోపే 'జనగణమన' పని పూర్తి చేసేయాలని పూరి స్కెచ్చేశారట. సో.. చూడాలి మరి ఇకనైనా పూరి డ్రీమ్ ప్రాజెక్టుకి ముహూర్తం కుదురుతుందా.. లేదా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/A1aRCsgSl

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts