సినీ సెలబ్రిటీలు ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పలు సంస్థలను ప్రమోట్ చేస్తూ ఆయన సంస్థల ప్రకటనల్లో భాగమవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రకటనలు చేస్తున్న బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్కి ఊహించని షాకిచ్చింది. వెంటనే పాన్ మసాలా సంబంధిత ప్రకటనల నుంచి వైదొలగాలని కోరుతూ సంచలన లేఖ రాసింది. పాన్ మసాలా వ్యసనం పౌరుల ఆరోగ్యాన్ని క్షీణిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలిందని, పాన్ కేన్సర్ కారకంగా పనిచేస్తోందని, తమలపాకులోని పదార్థాలు శరీరంలో కేన్సర్ కారకాలుగా మారి నోటి కేన్సర్కు దారితీస్తాయని తేలిందని పేర్కొంటూ పాన్ మసాలాలను ప్రోత్సహించే ప్రకటనలకు స్వస్తి చెప్పాల్సిందిగా జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ అమితాబ్ని కోరింది. ఈ మేరకు నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్కు ఓ లేఖ రాశారు. ''అమితాబ్ బచ్చన్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్. వీలైనంత త్వరగా ఆయన పాన్ మసాలా సంబంధిత ప్రకటనల నుంచి వైదొలగాలి. పొగాకు వ్యసనం నుంచి యువత దూరంగా ఉండటానికి ఈ చర్య సహాయ పడుతుంది'' అని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ తమ లేఖలో పేర్కొంది. చూడాలి మరి ఈ లేఖపై అమితాబ్ ఎలా స్పందిస్తారనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XWZxqr
No comments:
Post a Comment