
ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసిన రీమేక్ల ట్రెండ్ నడుస్తోంది. ఓ భాషలో సూపర్హిట్ సాధించిన సినిమా కథ హక్కులను కొని.. దాన్ని సదరు ఇండస్ట్రీకి తగ్గ నేటివిటీ ప్రకారం కొన్ని మార్పులు చేసి.. హిట్లు కొడుతున్నారు హీరోలు, దర్శకులు. అయితే ఒకప్పుడు ఎక్కువశాతం బాలీవుడ్లో వచ్చిన సినిమాలు తెలుగు ఇతర భాషల్లో రీమేక్ అయ్యేవి. కానీ, ఈ మధ్యకాలంలో తెలుగులో సూపర్హిట్ సాధించిన సినిమాలను హిందీలో రీమేక్ చేయడం పెరిగిపోయింది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ ఈ రీమేక్ సినిమాలతో హిట్లు సాధిస్తున్నారు. అలా రీమేక్ సినిమాలతో సక్సెస్ సాధించిన హీరోల్లో షాహిద్ కపూర్ కూడా ఒకరు. తెలుగులో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఆయన ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు , శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లగా వచ్చిన ‘’ సినిమాను అదే టైటిల్తో ఆయన హిందీతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే ఈ సినిమాకు కూడా డైరెక్టర్గా చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే షాహిద్.. తాజాగా అభిమానులతో ముచ్చటించారు. తనని ప్రశ్నలు అడగాలి అంటూ అభిమానులను అతను కోరారు. ఈ సందర్భంగా ఓ అభిమానులు ‘హీరో నాని గురించి ఒక్క మాటలో చెప్పండి’ అంటూ కోరారు. దీనికి షాహిద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘జెర్సీ సినిమాలో నాని చాలా అద్భుతంగా చేశారు. అతని నటన చూసి నాకు ఏడుపు వచ్చింది. నిజానికి ఈ సినిమా చేసేందుకు నాని నటనే నాకు స్పూర్తినిచ్చింది’ అంటూ షాహిద్ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని.. ఆయన తెలిపారు. ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా.. 2021, డిసెంబర్ 31వ తేదీన విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39IwJEl
No comments:
Post a Comment