ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ అందించిన ఆర్య.. తన కూతురి గురించి లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన హీరో

అల్లు అర్జున్ హీరోగా.. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘వరుడు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీరో . ఈ సినిమాలో విలన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఆయన.. ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇక అఖిల్ అక్కినేని నటించిన ‘అఖిల్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నటి సాయేషా సైగల్. ఆ తర్వాత ఆమె ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీల్లో సినిమా చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ‘గజినికాంత్’ అనే సినిమాలో ఆర్య మరియు సయేషా కలిసి తొలిసారిగా పని చేశారు. అక్కడ వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. 2019లో వీరిద్దరు వివాహ బంధంతో ఒకటి అయ్యారు. అయితే పెళ్లి తర్వాత కూడా వీళ్లిద్దరు కలిసి సినిమాలు చేశారు. రీసెంట్‌గా ‘టెడ్డీ’ అనే సినిమాతో ఈ జంట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా ఓటీటీలో విడుదల అయిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇక ఇది పక్కన పెడితే.. కొన్ని నెలల క్రితమే ఆర్య మరియు సాయేషాల జంట అభిమానులకు శుభవార్త తెలిపింది. సాయేషా ఓ పండటి అడబిడ్డకు జన్మనిచ్చిట్లు వాళ్లు ప్రకటించారు. అయితే ఇది జరిగి రెండు నెలల తర్వాత.. ఆర్య అభిమానులకు మరో గుడ్‌న్యూస్ అందించారు. తన కూతురికి ‘’ అని నాయకరణం చేస్తున్నట్లు ఆయన సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. తండ్రిగా మారి రెండు నెలలు గడిచాయి అని.. కూతురు పుట్టడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆర్య పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్య, విశాల్ నటిస్తున్న ‘ఎనిమి’ సినిమాలో దాంతో పాటు సుందర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరాన్మనై 3’ సినిమాల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3F03U4M

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts