‘జోష్’ సినిమాతో జోష్ఫుల్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగచైతన్య. ఆ తర్వాత ‘ఏం మాయ చేశావే’, ‘100% లవ్’, ‘మనం’ తదితర సినిమాలతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. అయితే ప్రతి సినిమాలో ఓ విలక్షణత చూపించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అలా ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు సక్సెస్ను తెచ్చి పెడితే.. కొన్ని మాత్రం తీవ్రంగా విఫలమయ్యాయి. కరోనా వ్యాప్తికి ముందు.. ‘మజలీ’, ‘వెంకీ మామ’ సినిమాలతో మంచి హిట్లు అందుకున్న ఆ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. అయితే త్వరలోనే ‘’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నాగచైతన్య మరో కొత్త ప్రయోగం చేయనున్నారు అని తెలుస్తోంది. ఆయన కెరీర్లోనే తొలిసారిగా విలన్ పాత్రలో కనిపించనున్నారట. ప్రస్తుతం దర్శకత్వంలో నాగచైతన్య ‘’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత విక్రమ్ దర్శకత్వంలోనే ఆయన ఓ వెబ్సిరీస్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్లోనే చై విలన్ పాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. విక్రమ్ కుమార్ చెప్పిన స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చేశాను అని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన చెప్పిన కథ థియేట్రికల్ రిలీజ్కి సరిపోదు అని.. అందుకే దీన్ని వెబ్సిరీస్గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేకాక.. ఇకపై కూడా మరిన్ని ఓటీటీ సినిమాల్లో, వెబ్సిరీస్లలో కూడా నటిస్తానని ఆయన తెలిపారు. అభిమానులకు కొత్తగా అనిపించేలా ఉంటే ఎలాంటి ప్రయోగం చేసేందుకు అయినా.. తాను సిద్ధంగా ఉన్నాను అని నాగచైతన్య అన్నారు. తన తండ్రి నాగార్జున, తాత నాగేశ్వరరావు కూడా ఇలా ప్రయోగాలు చేసే ప్రేక్షకులకు చేరువ అయ్యారు అని ఆయన తెలిపారు. వాళ్లు వేసిన బాటలోనే తాను నడుస్తాను అని ఆయన పేర్కొన్నారు. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ‘లవ్స్టోరి’ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39tyyoo
No comments:
Post a Comment