ప్రస్తుతం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్లపైనే హీరోలందరూ మోజు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మళ్లీ పాన్ ఇండియన్ రేంజ్ సినిమాను చేసేందుకు రెడీ అయ్యారు. దీని కోసం లాంటి విజనరీ డైరెక్టర్తో జత కట్టేశారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ను దిల్ రాజు ముందుండి నడిపిస్తున్నారు. త్వరలోనే అదిరిపోయే అప్డేట్ ఇస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పుడు శంకర్ హైద్రాబాద్లోనే ఉన్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి కాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. శంకర్ సినిమాలు అంటే పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్కో పాట కోసం శంకర్ ప్రత్యేకంగా ఖర్చు పెడుతుంటారు. అలాంటి పాటలకు మన కొరియోగ్రఫర్గా సెలెక్ట్ అయ్యారు. ఈ మేరకు శంకర్ను కలిసిన జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ముక్కాబులా పాటకు స్టేజ్ మీద డ్యాన్సులు చేశాను.. బాయ్స్ సినిమా కోసం 500 డ్యాన్సర్లలో ఎక్కడో మూలకు ఉన్నా.. అప్పటి నుంచి శంకర్ పని తనాన్ని, ఆయన్ను ఆరాధిస్తూనే ఉన్నాను.. ఆ స్థాయి నుంచి నేను ఈ రోజు శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్కు మెయిన్ కొరియోగ్రఫర్గా మారాను. ఈ క్షణాలను నమ్మలేకపోతోన్నాను. రామ్ చరణ్, దిల్ రాజుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rfRD5P
No comments:
Post a Comment