మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాపై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ విడుదల పట్ల కుతూహలాన్ని పెంచేస్తున్నాయి. దీంతో ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకలోకం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో తాజాగా 'ఆచార్య'లో అదే ట్విస్ట్ ఇదే అంటూ ఫిలింనగర్లో టాక్ మొదలైంది. కథలో కీలక పాయింట్ లీక్ అయిందని చెప్పుకుంటూ దాని గురించే చర్చించుకుంటున్నారు జనం. సామజిక నేపథ్యమున్న కథలను ఆవిష్కరించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న కొరటాల శివ.. 15 ఏళ్ళ క్రితమే ఈ కథను రాసుకొని పెట్టుకున్నారట. దర్శకుడిగా కెరీర్ మొదలు కాకముందే ఈ కథను ఓ పెద్ద హీరోతో చేయాలని అనుకొని అలాగే ఉంచారట. చివరకు మెగాస్టార్ సింగిల్ సిట్టింగ్లో ఈ స్టోరీని ఓకే చేయడంతో కథను మరింత సానబట్టారట. తన రెగ్యులర్ స్టైల్ మెయిన్టైన్ చేస్తూనే రక్తికట్టించే సన్నివేశాలు ప్లాన్ చేశారట. ముఖ్యంగా సంగీత రోల్ చాలా కీలకంగా ఉండనుందని, ఆ పాత్ర చిత్రానికి మేజర్ అసెట్ కానుండటమే గాక ఆమె చనిపోయే సీన్స్ సెటిమెంటల్గా గుండెలను పిండేసేలా ఉండబోతున్నాయట. సిద్ద పాత్రలో రామ్ చరణ్ రోల్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని టాక్. చిరంజీవి- రామ్ చరణ్ కాంబో వచ్చే సన్నివేశాలు థియేటర్స్ దద్దరిల్లేలా ఉంటాయట. నక్సల్స్ బ్యాక్ డ్రాప్తో ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల. మణిశర్మ బాణీలు కడుతున్న ఈ భారీ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'లాహే లాహే' సాంగ్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. దసరాను 'ఆచార్య'ను ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xibhA3
No comments:
Post a Comment