బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లెజెండరీ నటుడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం ఉదయం ఆయన కన్నుమూశారు. దిగ్గజ నటుడి మరణ వార్తతో బాలీవుడ్ సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో.. గత వారం ముంబైలోని హిందుజా హస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్లూరల్ ఎఫ్యూషన్తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇందుకోసం కొన్ని రోజులుగా ఐసియూలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు (బుధవారం) ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు. 1944లో తెరకెక్కిన ‘జ్వార్భాత’ సినిమాతో వెండితెరపై కాలుమోపిన దిలీప్ కుమార్ ఎన్నో సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు గడించారు. 1998లో విడుదలైన ‘ఖిల్లా’ మూవీ తర్వాత ఆయన తన సినీ కెరీర్కి గుడ్ బై చెప్పారు. 1960లో కే.ఆసిఫ్ నిర్మించిన 'మొఘల్ ఎ ఆజం' ఆయన జీవితంలో ఓ కీర్తి పతాకం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సత్తా చాటి పలు అవార్డ్స్ అందుకున్నారు దిలీప్ కుమార్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TzxueD
No comments:
Post a Comment