చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నగరంలో ఓ ఖరీదైన బంగ్లా కొన్నారని తెలుస్తుండటం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవలే ఆయన భార్య ఉపాసనతో కలిసి గృహప్రవేశం కూడా చేశారని వార్తలు వస్తుండటంతో ఈ ఇష్యూ పలు రకాల చర్చలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి రామ్ చరణ్ దృష్టి ముంబైపై ఎందుకు పడింది? అక్కడ సపరేట్గా బంగ్లా ఎందుకు కొనాల్సి వచ్చింది.. అందుకు ముఖ్యమైన కారణం ఏంటి? అనే దానిపై ఫిలిం నగర్లో చర్చలు ముదిరాయి. సినీ నటులన్నాక షూటింగ్స్ నిమిత్తం బయటి ప్రదేశాలకు వెళ్లి అక్కడి హోటల్స్లో స్టే చేయడం సర్వ సాధారణం. అయితే ఈ మధ్యకాలంలో తన షూటింగ్స్ నిమిత్తం రెగ్యులర్గా ముంబై వెళ్లొస్తున్న రామ్ చరణ్, కాస్త కొత్తగా ఆలోచించి అక్కడ తన విడిది కోసం ఏకంగా ఓ బంగ్లానే కొనుగోలు చేశారట. ఇది పెట్టుబడి మార్గమే కాకుండా తనకు చాలా ఉపయోగకరమని రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. తద్వారా ముంబై వెళ్ళినప్పుడల్లా హోటల్స్ కోసం వెతికే పని తప్పుతుందని, ఆ సమస్యకు సరైన పరిష్కారం లభించిందని ఆయన భావిస్తున్నారట. ఇక చెర్రీ తీసుకున్న ఈ బంగ్లా విషయానికొస్తే.. బీచ్ ఫేసింగ్తో ఎంతో విలాసవంతంగా ఈ భవనం ఉందని తెలుస్తోంది. ఫ్యామిలీతో సహా వెళ్లి ముంబైలో ఎన్ని రోజులైనా ఉండడానికి వీలుగా సకల సౌకర్యాలు ఈ భవనంలో ఉన్నాయట. ఏదేమైనా ముంబైలో రామ్ చరణ్ ఖరీదైన ఇల్లు తీసుకున్నారని తెలియడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR సినిమాలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజుగా ఆయన కనిపించబోతున్నారు. దీంతో పాటు చిరంజీవి 'ఆచార్య' మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hjHEZS
No comments:
Post a Comment