సీనియాయ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్ తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. కొంతమంది సినీ తారలు రాజ్ కుంద్రాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగా.. తాజాగా ఈ కేసులో తొలిసారి విచారణకు హాజరైన శృంగారతార షెర్లీన్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ఇష్యూలో పూనమ్ పాండేపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అశ్లీల చిత్రాలు షూట్ చేసి యాప్స్లో అప్లోడ్ చేస్తున్నారనే నెపంతో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఎవరెవరికి లింకులు ఉన్నాయి అనే కోణంలో సైబర్ క్రైమ్, పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత రియాక్ట్ అవుతూ రాజ్ కుంద్రా అరెస్ట్తో హృదయం ముక్కలైనంత పనైందని.. శిల్పాశెట్టి, ఆమె పిల్లలను చూస్తే బాధేస్తోందని కామెంట్ చేసింది. పూనమ్ చేసిన ఈ వ్యాఖ్యలపై షెర్లిన్ రియాక్ట్ అయింది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత తనపై రకరకాల ప్రచారం జరుగుతున్నట్లుగా చెప్పిన .. తాను ఎక్కడకి పారిపోలేదని చెప్పుకొచ్చింది. ఈ కేసులో తనను విచారించడంపై షెర్లీన్ వివరణ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. రాజ్కుంద్రాకు సంబంధం ఉన్న ఆర్మ్స్ప్రైమ్ సంస్థ గురించి అన్ని విషయాలు పోలీసులతో చెప్పానని, వాస్తవాలను అధికారులకు వెల్లడించానని తెలిపింది. అనవసరంగా అన్ని విషయాల్లో తనను లాగొద్దని, పూర్తి వివరణ పోలీసుల ముందు పెట్టానని ఆమె చెప్పింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eI7LYH
No comments:
Post a Comment