టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో రాను రాను వెబ్ సిరీస్ల హవా ఎక్కువవుతోంది. దీనికి తోడు లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ వేదికలపై ఈ వెబ్ సిరీస్లకు డిమాండ్ రెట్టింపయింది. దీంతో స్టార్ స్టేటస్ ఉన్న నటీనటులు సైతం వెబ్ సిరీస్ల బాట పట్టడం చూస్తున్నాం. ఇప్పటికే అక్కినేని కోడలు , అగర్వాల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ ఈ స్టెప్ తీసుకోగా ప్రస్తుతం మరో హాట్ బ్యూటీ కూడా వెబ్ సిరీస్లలో నటించేందుకు రెడీ అయిందట. జనాల్లో బాగా డిమాండ్ చేకూరుతున్న ఓటీటీ కంటెంట్తో త్వరలోనే ఆకట్టుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సరికొత్త కథలను వింటోందట. కొత్త దర్శకులైనా సరే కథలో వైవిద్యం ఉంటే వెబ్ సిరీస్ చేయడానికి ఆమె సిద్ధమైందని తెలుస్తోంది. ఓటీటీ అనేది నెక్స్ట్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానున్నట్లు తాజా పరిస్థితులు చూస్తుంటే తెలుస్తోంది. పెద్ద సినిమాలు కూడా అందులో రిలీజ్ అవుతుండటం అందుకు ప్రధాన కారణం. సో.. ఇదే ఆలోచనతో మంచి అవకాశాలు వస్తే ఓటీటీ కంటెంట్తో రావడానికి రెడీ అయినట్లుంది రకుల్. ఇప్పటికే సమంత నటించిన 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ చేసి విమర్శకుల ప్రశంసలందుకోవడమే గాక భారీ విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం సరైన విజయం కోసం తహతహలాడుతున్న రకుల్.. అక్కినేని కోడలి బాటలో వెళ్లేందుకు సిద్ధమైందని చెప్పుకుంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. ఇటీవలే వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఫినిష్ చేసిన రకుల్.. పలు హిందీ సినిమాల్లో నటిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hGta50
No comments:
Post a Comment