ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ హీరోయిన్ భర్త చిక్కుల్లో పడ్డారు. నీలిచిత్రాల చిత్రీకరణ, వాటిని కొన్ని యాప్స్ ద్వారా ఆన్లైన్లో పబ్లిష్ చేస్తున్నారనే కేసులో ముంబై పోలీసుల ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నీలి చిత్రాల రాకెట్లో రాజ్ కుంద్రా పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు కీలక ఆధారాలు లభించడంతో ఆయనను సోమవారం రోజు అరెస్ట్ చేసినట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన పోలీసుల దగ్గర కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఫిబ్రవరి నెల లోనే ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రాపై పోలీస్ కేసు నమోదైంది. మొబైల్ యాప్లలో విడుదల చేస్తున్న వీడియోలకు రాజ్కుంద్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్నది పోలీసులు ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ చేపడుతూ రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. తల గతంలో మోడల్ షెర్లిన్ చోప్రా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వెబ్ సిరీస్ పేరుతో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్లో అతనికి బెయిల్ మంజూరైంది. ఇదే కేసులో రాజ్ కుంద్రాకు కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లపై స్పందించిన శిల్పాశెట్టి భర్త ఆ స్టార్టప్ నుంచి తాను అప్పటికే వైదొగిలిగానని, ఆ కంపెనీకి తనకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అలాంటి వెబ్ సిరీస్ల నిర్మాణంలో గానీ, ఆ సన్నివేశాల చిత్రీకరణలో గానీ తన పాత్ర లేదని పోలీసులకు తెలిపాడు రాజ్ కుంద్రా. మళ్ళీ అదే కేసు తెరపైకి రావడం, రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం బీ టౌన్లో హాట్ టాపిక్ అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hQaq4n
No comments:
Post a Comment