ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీ పూర్తిచేసే పనిలో ఉన్న ఎన్టీఆర్.. ఇది పూర్తయిన వెంటనే సినిమాను లైన్లో ఉంచారు. 30గా ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మరోవైపు 'ఆచార్య' సినిమా పనులతో బిజీగా ఉన్న కొరటాల శివ.. ఎన్టీఆర్తో చేయబోయే సినిమా కోసం ఇప్పటినుంచే మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారని సమాచారం. ఈ మేరకు క్యాస్టింగ్ విషయంలో వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నారట కొరటాల. ఈ మధ్యకాలంలో వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మన టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు బాలీవుడ్, ఇతర భాషల్లోని ఫేమస్ యాక్టర్స్ భాగమవుతుండటం చూస్తున్నాం. అలా వాళ్ళ రాక సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్న దర్శకనిర్మాతలు అందుకు అనుగుణంగా పరభాషా నటులను రంగంలోకి దించుతున్నారు. సరిగ్గా కొరటాల శివ కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. వెండితెరపై తారక్తో పాటు భారీ క్రేజ్ ఉన్న ఇతర భాషల్లోని స్టార్ హీరోలను చూపిస్తూ చాలా గ్రాండ్గా ఈ సినిమాను నందమూరి అభిమానుల ముందుకు తేవాలని కొరటాల గట్టిగానే ఫిక్సయ్యారట. 'ఎన్టీఆర్-కొరటాల2'గా ఈ ప్రాజెక్టు అనౌన్స్ అయినప్పుడే ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో ఈ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' సూపర్ డూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ క్రేజీ కాంబోపై పడింది. నందమూరి కళ్యాణ్రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఏప్రిల్ 29వ తేదీ 2022న రిలీజ్ చేస్తామని కూడా ముందే ప్రకటించేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీని ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. సో.. చూడాలి మరి ఎన్టీఆర్తో కొరటాల మ్యాజిక్ ఏ రేంజ్లో ఉండనుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TBpF7V
No comments:
Post a Comment