30 Years For Aditya 369 : ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం.. బాక్సాఫీస్ లెక్కలివే!

టాలీవుడ్ చరిత్రను తీసుకుంటే.. అందులో ఎప్పటికీ చెరిగిపోని.. ఇంకెప్పటికీ తెరకెక్కించలేని.. ఆ సాహసం చేయలేని చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటి వరుసలో ఉండే చిత్రమే ఆదిత్య 369. అలాంటి చిత్రం మళ్లీ తెరకెక్కించడం అంటే ఆషామాషీ కాదు. అప్పటి వరకు చూడని ఎన్నో విశేషాలను, అద్భుతాలను ఈ చిత్రం ద్వారాతెలుగులో చూపించారు. ఇండియాలో మొదటి సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం 1991 జూలై 18న విడుదలైంది. నేటికి ఈ సినిమా వచ్చి ముప్పై ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆదిత్య 369 పుట్టుక ఎలా జరిగిందో ఓ సారి చూద్దాం. ఆదిత్య 369 పుట్టుకకు మూల కారణం స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు తాను అనుకున్న టైం మిషిన్ కథను బాలుకు చెప్పడం, అది తెగ నచ్చడంతో తన బంధువైన నిర్మాత శివలెంక ప్రసాద్‌కు చెప్పడం, బాలకృష్ణ అయితే శ్రీకృష్ణ దేవరాయల పాత్రకు సరిగ్గా సరిపోతాడని సూచించడం, నిర్మాత దగ్గర బాలకృష్ణ డేట్లు ఉండటంతో అలా ఆదిత్య 369 పుట్టుకకు నాంది మొదలైంది. మొదట హీరోయిన్‌గా విజయశాంతిని అనుకున్నా చివరకు మోహినీని ఫిక్స్ చేశారు. అలా ప్రతీ పాత్రకు ఆర్టిస్ట్‌లు పర్ఫెక్ట్‌గా సరిపోయారు. సైంటిస్ట్‌గా హిందీ నటుడు టీనూ ఆనంద్ అద్భుతంగా నటించేశారు. ఈ చిత్రంలోని ప్రతీ విభాగంగా అద్భుతమైన పని తీరును కనబర్చింది. ఇళయారాజా అందించిన పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోతాయి. సినిమా అంతా కూడా దాదాపు 110 రోజుల్లో పూర్తయింది. చివరకు టైటిల్ దగ్గర అసలు సమస్య వచ్చింది. ఏ టైటిల్ పెడదామని చాలా మథన పడ్డారట. కాలయంత్రం, యుగపురుషుడు వంటి టైటిల్స్‌ను ఆలోచించారట. కానీ మనకు సూర్యుడంటే కాలానికి ప్రతీక. అందుకే ఆదిత్య అని ఫిక్స్ అయ్యారట. ఇక మిషిన్ నంబర్‌ను 369 అని అలా ఆదిత్య 369 నిర్ణయించుకున్నారట. మొత్తంగా ఈ చిత్రం కోసం కోటిన్నర ఖర్చు అయిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా సాధించిన వసూళ్లు తెలిస్తే మాత్రం కళ్లు చెదిరిపోతాయి. దాదాపు తొమ్మిది కోట్లు వసూళ్లు చేసింది. దాదాపు ఆరు రెట్ల లాభాన్ని ఈ మూవీ తెచ్చిపెట్టేసింది. అయితే ఆదిత్య 369కు సీక్వెల్‌గా బాలకృష్ణ ఓ చిత్రాన్ని చేయాలని ఫిక్స్ అయ్యారని తెలిసిందే. తాను కథను రాసిన బాలయ్య.. తన కొడుకు మోక్షజ్ఞను సినీ ఎంట్రీ ఇప్పించాలని చూస్తున్నారు. ఈ మేరకు బాలయ్య మంచి స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. తానే దర్శకత్వం వహిస్తానని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఆదిత్య 369కి ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా వల్ల వచ్చిన గౌరవం 30 ఏళ్ల తరువాతే కాదు.. యాభై ఏళ్లు అయినా ఉంటుందని అన్నారు. ఇక దర్శకుడు సింగీతం మాట్లాడుతూ.. తాను ఈ సందర్భంగా ఎస్పీ బాలు, బాలయ్య, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌లకు థ్యాంక్స్ చెప్పదలుచుకున్నానని అన్నారు. ఇది ఇండియాలోనే తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2USfDjk

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts