స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో '' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన స్పెషల్ సాంగ్ 'సానా కష్టం' సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. చిరంజీవి- చిందులు, మణిశర్మ బీట్ విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ వీడియో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడం పట్ల యంగ్ బ్యూటీ రెజీనా చాలా క్రేజీగా రియాక్ట్ అయ్యారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన రెజీనా.. కేవలం చిరంజీవి కోసమే ఈ స్పెషల్ సాంగ్ చేశానని చెప్పడం విశేషం. తానెప్పుడూ ఇలాంటి పార్టీ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చేయలేదని చెప్పిన ఆమె, చిరంజీవి కోసమే తొలిసారి ఇలాంటి డాన్సింగ్ మూమెంట్లో భాగమయ్యానని చెప్పుకొచ్చారు. చిరంజీవిని మెగాస్టార్ అని ఎందుకు పిలుస్తారో సెట్స్లో చూశాక అర్థమైందని, ఆయన డ్యాన్స్ అంటే తనకెంతో ఇష్టమని రెజీనా చెప్పారు. దేవాలయ భూముల స్కామ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్న 'ఆచార్య' సినిమా నిర్మాణంలో రామ్ చరణ్ కూడా భాగమవుతుండటం విశేషం. అలాగే చిత్రంలో చిరంజీవితో తెర పంచుకోనున్నారు చెర్రీ. సిద్ద పాత్రలో ఆయన రోల్ సినిమాకే మేజర్ అసెట్ కానుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్త సమర్పణలో ఈ ప్రతిష్టాత్మక సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. చిరంజీవి, రామ్ చరణ్ కలసి నటిస్తుండటంతో ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3F3M4fK
No comments:
Post a Comment