తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకులు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు (జనవరి 3) ఉదయం 8 గంటల 30 నిమిషాలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఒకానొక సమయంలో దర్శకుడిగా సత్తా చాటారు పి. చంద్రశేఖర్ రెడ్డి. సుమారు 80 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలతో ఆయన సినిమాలు రూపొందించారు. ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలనాటి ఫేమస్ చిత్రాలైన ''శాంతి సందేశం, బడి పంతులు, అన్నా చెల్లెల్లు, భలే అల్లుడు, మానవుడు దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు'' సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు ఇండస్ట్రీలో లెజెండరీ దర్శకులుగా పేరు తెచ్చుకున్న కోదండరామి రెడ్డి, బి గోపాల్ లాంటి వాళ్లకు చంద్రశేఖర్ రెడ్డి గాడ్ ఫాదర్ లాంటి వారు. పి. చంద్రశేఖర్ రెడ్డి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pLJFSz
No comments:
Post a Comment