మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదలవుతోంది. అయితే, ప్రస్తుతం ఆ భాషల్లో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం. ఇతర భాషల్లో చిరంజీవికి డబ్బింగ్ చెప్పే వాయిస్ కోసం వెతుకుతున్నారు. తమిళంలో ప్రముఖ నటుడు అరవింద్ స్వామి.. చిరంజీవికి గొంతును అరువివ్వబోతున్నారు. ఈమేరకు రామ్ చరణ్.. అరవింద్ స్వామిని సంప్రదించగా ఆయన చిరంజీవికి డబ్బింగ్ చెప్పడానికి అంగీకరించారని సమాచారం. ఇప్పటికే అరవింద్ స్వామి వాయిస్ను కూడా టెస్ట్ చేశారట. కొన్ని తమిళ డైలాగులు రాసి అరవింద్ స్వామికి పంపారని, దానికి డబ్బింగ్ చెప్పి ఆ ఆడియోను వాట్సాప్లో రామ్ చరణ్కు పంపించారని ‘సైరా’ యూనిట్కు చెందిన ఒకరు వెల్లడించారు. Also Read: అరవింద్ స్వామి డబ్బింగ్ వాయిస్ను రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవికి వినిపించారట. అరవింద్ వాయిస్ చాలా బాగుందని, తనకు కరెక్ట్గా సరిపోతుందని చిరంజీవి వెంటనే ఓకే చేసేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు తమిళంలో కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇప్పుడు చిరంజీవికి అరవింద్ స్వామి డబ్బింగ్ చెబుతుండటంతో అక్కడ ఈ సినిమాకు మంచి ప్రచారం లభించినట్టే. మలయాళంలో మోహన్ లాల్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘ధృవ’ సినిమాలో రామ్ చరణ్, అరవింద్ స్వామి కలిసి నటించిన సంగతి తెలిసిందే. ‘సైరా’కు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి ‘ధృవ’ను తెరకెక్కించారు. దీంతో చరణ్, సురేందర్ రెడ్డిలతో అరవింద్ స్వామికి మంచి స్నేహం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యంతోనే చరణ్, సురేందర్ కోసం అరవింద్ స్వామి డబ్బింగ్ చెప్పడానికి అంగీకరించారని సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2N3Zv95
No comments:
Post a Comment