డైరెక్టర్స్‌కు షాక్ ఇస్తున్న సమంత

కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ను రాబడతాయని ‘ఓ బేబీ’ సినిమాతో నిరూపించారు అక్కినేని కోడలు సమంత. లీడ్ రోల్‌లో నటించే సినిమాల ద్వారా నిర్మాతలకు ఎంతకాదన్నా రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు శాటిలైట్ హక్కులు అమ్ముడుపోతాయి. దీనిని బట్టే చూస్తే సమంత మార్కెట్ విలువ రూ.35 కోట్ల వరకు ఉంటుంది. సమంత నటించిన సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటే నిర్మాతలకు రూ.20 కోట్ల లాభం వస్తుందని ట్రేడ్ ఎనలిస్ట్‌ల అంచనా. అందుకే సమంత డేట్ల కోసం దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే ఇప్పుడు సమంత గురించి టాలీవుడ్‌లో వినిపిస్తున్న చర్చ ఏంటంటే.. దర్శకుడు కథ చెప్పడానికి సమంత వద్దకు వెళితే తనకు అంతగా నచ్చలేదని చెబుతున్నారట. ఇందుకు కారణం కథానాయిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడమే. స్క్రిప్ట్స్‌లో తన పాత్రకు సంబంధించి మార్పులు చేయాలని సమంత డిమాండ్ చేస్తున్నారట. ఇది విని దర్శకులు షాక్ అవుతున్నారని ఫిలిం వర్గాల సమాచారం. దాంతో సమంతకు కథ చెప్పే సమయంలో నాలుగైదు సినిమాలు చేసేయొచ్చని దర్శక, నిర్మాతలు అనుకుంటున్నారట. ‘మహానటి’ సినిమా సమయంలో ఇదే జరిగింది. ఇక నుంచి కథానాయికలకు మంచి పాత్రలు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయకూడదని ఆర్డర్ వేయాల్సిందేనని సమంత అన్నారు. అన్ని రకాల పాత్రలు చేయగలిగే సత్తా కథానాయికల్లో ఉన్నా కొందరు దర్శక నిర్మాతలు అసలు పట్టించుకోవడంలేదని ఆమె మండిపడ్డారు. దీనిని బట్టి చూస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కోడలి సమంత తనదైన మార్‌ని ముద్రించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లున్నారు. ఇటీవల తన కుటుంబంతో కలిసి యూరప్‌లో విహారయాత్ర నిమిత్తం వెళ్లారు సమంత. అక్కడ తన మామయ్య అక్కినేని నాగార్జున బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. అక్కడి నుంచి వచ్చాక ఆమె ‘96’ రీమేక్‌లో నటిస్తారు. ఇందులో సమంతకు జోడీగా శర్వానంద్ నటించనున్నారు. ఆ తర్వాత ఆమె బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు బయోపిక్‌లో నటించే అవకాశం ఉన్నట్లు ఎప్పటి నుంచో వదంతులు వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PSp0wm

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts