చెయిన్ లాగినందుకు కరిష్మా కపూర్‌పై కేసు.. 20 ఏళ్లుగా నడుస్తూనే ఉంది

మన దేశంలో సెలబ్రిటీలకు సంబంధించిన కేసులు ఏళ్లు గడుస్తున్న ఓ కొలిక్కి రావని మరోసారి రుజువైంది. 1997లో బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, కరిష్మా కపూర్‌లపై కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో వారు నటిస్తున్న ‘భజరంగ్’ అనే సినిమా చిత్రీకరణలో ఉన్నారు. ఈ షూటింగ్ రాజస్థాన్‌లోని సన్వార్దా గ్రామంలో ఉన్న రైలులో జరిగింది. అయితే చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కరిష్మా, సన్నీ కావాలనే చెయిన్ లాగేశారట. దాంతో రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌గా పనిచేసిన సీతారామ్ మలకార్ జనరల్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనవసరంగా రైల్వే కమ్యునికేషన్‌కు ఆటంకం కలిగించినందుకు, తాగి న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు, రైల్వే సిబ్బందిని డ్యూటీ చేసుకోనివ్వనందుకు, ట్రెస్‌పాసింగ్ చేసినందుకు గానూ వీరిపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరు ఇలా చేయడం వల్ల రైలు దాదాపు 25 నిమిషాల పాటు నిలిచిపోయిందని ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారని పేర్కొన్నారు. దాంతో స్థానిక రైల్వే స్టేషన్ అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసి ఇప్పటికి దాదాపు 20 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 2009లో కరిష్మా, సన్నీకి స్థానిక న్యాయస్థానం శిక్ష విధించింది. కానీ తాము ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడిస్తూ 2010లో సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్‌ను పరిశీలించిన సెషన్స్ కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చి విడుదల చేయాలని కోరింది. అంతా సర్దుమణిగింది అనుకుంటుండగా ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. మొన్న 17న రైల్వే కోర్టు మళ్లీ కరిష్మా, సన్నీపై కేసులు పెట్టింది. అయితే దీనిపై తాజాగా సన్నీ, ముంబయిలోని సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును న్యాయస్థానం 24 సెప్టెంబర్‌కు వాయిదా వేసింది. దాంతో బుధవారం కరిష్మా, సన్నీ మళ్లీ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. ఈ ఒక్క కేసే కాదు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై పెట్టిన కేసులు కూడా ఇప్పటివరకు ఓ కొలిక్కి రాలేదు. అతని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు కృష్ణజింకలను వేటాడి చంపాడన్న కేసులు కూడా నమోదయ్యాయి. అయితే గతేడాది జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్‌కు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఒక రోజంతా సల్మాన్.. రేప్ కేసులో నిందితుడైన ఆశారాం బాపుతో కలిసి జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. ఆ మరుసటి రోజు ఆయనకు బెయిల్ రావడంతో బయటికి వచ్చేశారు. అయితే తనపై వేసిన కేసులు కొట్టివేయాల్సిందిగా కోరుతూ సల్మాన్ కొన్ని నెలల క్రితం జోధ్‌పూర్ సెషన్స్ కోర్టులో అర్జీ పెట్టుకున్నారు. దీనిపై ఇంకా వాదనలు జరుగుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31D6tpk

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts