సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ చకచకా సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో హరి హర వీర మల్లు సినిమా సెట్స్పై ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో అప్డేట్ ఇచ్చారు. ఓ సీన్ చిత్రీకరిస్తే ఇంటర్వెల్ వరకు సినిమా పూర్తవుతుందని అన్నారు. తదుపరి షెడ్యూల్ను నవంబర్ నుంచి ప్రారంభించేలా ప్లాన్ చేసుకున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తొలి పీరియాడికల్ డ్రామా ఇది. మొఘల్ కాలంలో ప్రజలకు అండగా నిలబడిన ఓ బందిపోటు దొంగ పాత్రనే ఇందులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మొఘల్ చక్రవర్తి పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తుంటే, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మొఘల్ రాకుమారి పాత్రలో కనిపించనుందని టాక్. ఈ సినిమా చేస్తున్న సమయంలో వచ్చిన కోవిడ్ గ్యాప్లో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్తో కొండపొలం సినిమా చేశారు. ఆ సినిమా అక్టోబర్ 8న విడుదలవుతుంది. మరో వైపు పవన్ తన తాజా చిత్రం భీమ్లానాయక్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. కానీ అదే రోజున ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న ట్రిపుల్ ఆర్ విడుదలవుతుంది. మరి భీమ్లానాయక్ను వాయిదా వేస్తారో లేదో చూడాలి. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్కు రీమేకే ఈ చిత్రం. ఇందులో రానా దగ్గుబాటి మరో హీరోగా కనిపిస్తున్నారు. సాయిపల్లవి, సంయుక్తా మీనన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WFJr3M
No comments:
Post a Comment