విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్ ఘోష్ ఓ మహిళతో మాట్లాడిన ఆడియో టేప్ లీకైంది. అందులో అప్పడాల విజయలక్ష్మి అనే మహిళ అజయ్ ఘోష్ను ట్రాప్ చేయడానికి ప్రయత్నించింది. అజయ్ ఘోష్కు ఫోన్ చేసిన మహిళ తనను సినిమాకు తీసుకెళ్లాలంటూ డిమాండ్ చేసింది.అసలేం జరిగింది.. ఎవరీ అప్పడాల విజయలక్ష్మి, ఇద్దరి మధ్య సంభాషణ ఎలా సాగింది అనే వివరాల్లోకెళ్తే...అజయ్ ఘోష్కు ఫోన్ చేసిన మహిళ ఇద్దరం ఒకే కాలనీలో ఉంటామని తను అప్పడాలు తయారు చేస్తుంటానని చెప్పింది. అసలు విషయం చెప్పమని అజయ్ ఘోష్ చెప్పగా, మారుతిగారు డైరెక్ట్ చేసిన ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాలో మీరు ఫుల్ లెంగ్త్ రోల్ చేశారని నాకు తెలిసిందని, ఆ సినిమా నవంబర్ 4న విడుదల చేయబోతున్నారటగా, ఆ సినిమాకు మీరే నన్ను తీసుకెళ్లాలని చెప్పింది. అయితే అజయ్ ఘోష్ అలాంటి వ్యవహారాల మనిషిని తాను కానని, మీరు సినిమాకెళ్లాలంటే వెళ్లండని చెప్పారు. దీపావళి రోజు, నవంబర్ 4న తనను మంచిరోజులు వచ్చాయి సినిమాకు తీసుకెళ్లకపోతే, మీ జేబులో మతాబులు పెట్టి వెలిగిస్తానని మహిళ అజయ్ ఘోష్కి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే అజయ్ ఘోష్ అవేవీ పట్టించుకోలేదు. రోజూ ఇంట్లో వాళ్లతో సినిమాలకేం వెళతారు నాతో సినిమాకు రండని చెప్పిన మహిళ, చివరకు అజయ్ ఘోష్ను బ్లాక్ మెయిల్ చేసింది. నన్ను సినిమాకు తీసుకెళ్లకపోతే మీరు నాతో చేసిన విషయాలన్నింటినీ బయటకు చెప్పేస్తానంది. ఇవన్నీ చూస్తుంటే ఎవరో అజయ్ ఘోష్ను ఎవరు.. ఎందుకు ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే సందేహం రాక మానదు. అయితే ఇదంతా ట్రాష్.. ఎందుకంటే డైరెక్టర్ మారుతి తను డైరెక్ట్ చేసిన మంచి రోజులు వచ్చాయి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ..డిఫరెంట్గా ఉండాలని ఈ ఆడియో రికార్డ్ చేయించి విడుదల చేశారు. ఇందులో తమ ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాను నవంబర్ 4న, దీపావళికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సంతోశ్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ కౌర్ హీరోయిన్గా నటిస్తుంది. వి సెల్యులాయిడ్, ఎస్కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a4JJo0
No comments:
Post a Comment