సూపర్స్టార్ రజినీకాంత్ అభిమానులు ఆయన సినిమా ‘అన్నాత్తే’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా ఈ మూవీ నవంబర్ 4న విడుదలవుతుంది. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి తొలి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే, ఈ పాటను దివంగత గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడారు. సాధారణంగా రజినీకాంత్ సినిమాల్లో తొలి పాటను బాలు పాడుతుంటారు. తన సెంటిమెంట్ను కొనసాగిస్తూ ‘అన్నాత్తే’ సినిమా కోసం బాలుతో పాట పాడించారు రజినీకాంత్. టైటిల్ సాంగ్, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ, హీరో క్యారెక్టరైజేషన్ను తెలియజేసేలా రూపొందిన ఈ పాట గురించి రజినీకాంత్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ‘‘ఎస్పీబీగారు 45 ఏళ్ల పాటు నా గొంతుగా జీవించారు. నా చిత్రం ‘అన్నాత్తే’లో ఆయన పాడిన పాటే ఆఖరి పాట అవుతుందని కలలో కూడా అనులేదు’’ అంటూ సూపర్స్టార్ రజినీ, ఎస్పీబీతో తనకున్న ఎమోషనల్ బాండింగ్ గురించి తెలియజేశారు. ఈ సినిమాకు డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్గానే ‘అన్నాత్తే’ సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది. అందులో రజినీకాంత్ను మాస్ కోణంలో దర్శకుడు శివ ఆవిష్కరించిన తీరుకి ప్రేక్షకాభిమానులు ఫిదా అయ్యారు. ఖుష్బూ, మీనా, నయనతారలు నటించిన ఈ చిత్రంలో రజినీకాంత్ కుమార్తెగా కీర్తి సురేశ్ కనిపించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసి రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న రజినీకాంత్కు ఆరోగ్య సమస్యలు రావడంతో షూటింగ్ ఆగింది. ఆయన రాజకీయాల్లోకి రానని ప్రకటన చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Yq4IiP
No comments:
Post a Comment