కాంట్రవర్సియల్ సినిమాలు చేయడంలో దిట్టగా పేరొందిన .. మురళి- దంపతులపై సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్కౌంటర్లో చంపబడిన నక్సలైట్ ఆర్.కె అలియాస్ రామకృష్ణకి, కొండా మురళికి ఉన్న ప్రత్యేక సంబంధం గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నట్లు తెలుపుతూ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు వర్మ. గతంలో 'రక్త చరిత్ర' అంటూ పరిటాల రవి జీవితాన్ని తెర మీద చూపించిన .. ఇప్పుడు 'కొండా' పేరుతో తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారు. అక్టోబర్ 12న వరంగల్లో కొండా సురేఖతో కలిసి ర్యాలీని తీసి గ్రాండ్గా ఈ మూవీని లాంచ్ చేశారు వర్మ. ఈ సినిమా ద్వారా 80, 90ల్లోని ల్యాండ్ లార్డ్స్ రాక్షసత్వాన్ని ‘కొండా’ మూవీతో తెరమీద చూపించబోతున్నారని టాక్. ''అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి.. జై తెలంగాణ'' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇది చూసి అసలు ఎవరీ నల్లబల్లి సుధాకర్? ఆర్జీవీ ఎందుకు ఈ కామెంట్ చేశారు? అనే దానిపై చర్చలు షురూ అయ్యాయి. 'కొండా' సినిమా విషయంలో ఓ మంత్రి ఆర్జీవీని బెదిరించారని అందుకే ఆ మంత్రి పేరును మార్చి ఇలా ఇన్ డైరెక్ట్గా ఇలా ట్వీట్ చేశారని తెలుస్తోంది. చూస్తుంటే.. ఈ సినిమా విడుదల సమయానికల్లా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందా? అనే అనుమానాలు షురూ అయ్యాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ncrkMc
No comments:
Post a Comment