సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని స్వీట్ మూమెంట్స్ ఉంటాయి. అలాంటి వాటిని తలచుకొని ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంటే పొందే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. జీవితంలో ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు ఓ సమయం, సందర్భం కూడా వస్తుంది. అలాంటి సందర్భమే పవన్ కళ్యాణ్ మాజీ భార్య, హీరోయిన్ రేణు దేశాయ్కి వచ్చింది. దీంతో తన మనసులోని మాటను బయటపెడుతూ పవన్ కళ్యాణ్తో నాటి జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంది రేణు. 'బద్రి' సినిమాతో పవన్ కళ్యాణ్తో రేణు ప్రయాణం మొదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్తో రొమాన్స్ చేసి పవర్ స్టార్ అభిమానులకు స్పెషల్ కిక్కిచ్చింది రేణు. ఏప్రిల్ 20వ తేదీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. దీంతో ఈ సినిమాలో నటించిన అమీషా పటేల్, రేణు దేశాయ్లకు మంచి గుర్తింపు లభించింది. అంతేకాదు రేణు- పవన్ కళ్యాణ్ ప్రేమకు బీజం పడింది కూడా ఇక్కడే. అయితే నిన్నటితో ఈ 'బద్రి' మూవీ 21 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఆ నాటి జ్ఞాపకాలను, పవన్తో అనుభూతిని గుర్తు చేసుకుంటూ రేణు పోస్ట్ పెట్టింది. అప్పట్లో ఓ ఊపు ఊపేసిన యే చికీతా.. పాటలోని ఓ స్టిల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. ''చికీతా షూటింగ్ చేస్తుండగా తీసిన పిక్ ఇది. నా దుపట్టా నాకు సన్ స్రీన్గా రక్షణ కల్పిస్తోంది. పవన్తో బాంబింగ్ ఫొటో'' అని తన ఇన్స్స్టాలో కామెంట్ పెట్టింది. దీంతో మరోసారి ఇలా రేణు- పవన్ జోడీని చూసి ఈ ఫొటోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. 'బద్రి' సినిమా షూటింగులో పవన్ కళ్యాణ్తో రేణుదేశాయ్కి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. సహజీవనం వరకు వెళ్లింది. కొన్నేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి 2009 జనవరి 28వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జోడీ ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య పుట్టాక వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ రేణుతో ఉండగా పవన్ మరో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P6enGz
No comments:
Post a Comment