నందమూరి ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. రండి గెలుద్దాం అన్న యంగ్ టైగర్ వెనకడుగు.. ఎన్టీఆర్ షో కష్టమేనట!

తెలుగు తెరపై తనదైన నటనతో భారీ పాపులారిటీ కూడగట్టుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్- 1తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిన ఎన్టీఆర్.. రీసెంట్‌గా మరో షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. 'ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ పిలిచారు యంగ్ టైగర్. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు తెలిపారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ షో క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఇప్పటికే ఈ షో ప్రోమో రిలీజ్ చేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో వచ్చే నెల నుంచి ఈ షోను టెలికాస్ట్ చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ దాడి ప్రారంభం కావడంతో షోని వాయిదా వేయక తప్పలేదట. తాజా సమాచారం మేరకు ఈ షో టెలికాస్ట్ కావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఎన్టీఆర్ కమిటైన సినిమాల షూటింగ్ ఆపేశారు. కోవిడ్ ఉదృతి తగ్గగానే ముందు ఆయా షూటింగ్స్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో.. ఇలాంటి సమయంలో ఈ షోకి ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టమవుతుందని, అందుకే జూన్ చివరి లేదా జూలై మొదటి వారంలో ఈ షో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయనే టాక్ జనాల్లో నడుస్తోంది. ఏదిఏమైనా ఈ కరోనా సమయంలో ఇంట్లో కూర్చొని బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి చూడాలనుకునే ప్రేక్షకులందరికీ ఇది బ్యాడ్ న్యూసే అని చెప్పుకోవాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gPzjwV

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts