‘నీతులు ముందు వాళ్లకు చెప్పు.. సిగ్గులేకుండా తిరుగుతున్నారు’.. కరీనాపై నెటిజన్లు ఫైర్

ఓవైపు కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అట్టుడికిపోతుంది. ప్రతీరోజు లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఉపద్రవాన్ని అడ్డుకొనేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాయి. రాత్రి పూట కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే పరిస్థితలు కనిపిస్తున్నాయి. అయితే దేశం ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఉంటే కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు మాల్దీవులకు షికార్లకు వెళ్లడంపై సర్వత్ర విమర్శల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ ప్రేమికులు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కొద్ది రోజుల క్రితం మాల్దీవులకు షికారుకు వెళ్లి ముంబైకి తిరిగి వచ్చారు. వీరే కాదు.. మరికొంత మంది సెలబ్రిటీలు కూడా విహారయాత్రలు చేస్తూ.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. దేశంలో ఇంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మీరు విహారయాత్రలకు వెళ్లి ఎలా ఎంజాయ్ చేస్తారు అంటూ నెటిజన్లు వారిపై ఫైర్ అయ్యారు. నవాజుద్దీన్ సిద్ధికీ, శృతి హాసన్ తదితర సెలబ్రిటీలు కూడా వీరి హాలీడేలపై మండిపడ్డారు. అయితే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ కరీనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఉందో ఇంకా కొందరికి అర్థం కావడం లేదని తెలిసి నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఒకసారి ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు, లేదా మీ గడ్డం కిందకు మాస్క్ ధరించినప్పుడు లేదా రూల్స్ అతిక్రమించినప్పుడు ఒకసారి మన వైద్యులు, సిబ్బంది గురించి ఆలోచించండి. వాళ్లు మన కోసం శారీరకంగా, మానసికంగా శ్రమిస్తున్నారు. అందుకు ఇది చదువుతున్న ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడ ఇండియాకు మీరు ఎంతో అవసరం’’ అంటూ కరీనా తన పోస్ట్‌లో పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ‘ముందు ఈ నీతులు మీ వాళ్లకు చెప్పు. వాళ్లు సిగ్గు లేకుండా వేకెషన్‌లలో ఎంజాయ్ చేస్తున్నారు’.. ‘నీ కజిన్(రణ్‌బీర్ కపూర్) వారం రోజుల క్రితమే తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాల్దీవులకు వెళ్లి వచ్చాడు. వాళ్లకు ఈ నీతులు వర్తించవా?’.. ‘మాల్దీవుల్లో షికార్లు చేస్తున్న నీ మిత్రులకు కూడా కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి మేడం’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కరీనా ప్రస్తుతం అమీర్ ఖాన్ హీరోగా చేస్తున్న ‘లాల్‌సింగ్ ఛడ్డా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరీలో కరీనా ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nytTrD

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts