దేశంలో దాడి మరీ ఉదృతంగా ఉంది. దేశంలో సెకండ్ వేవ్ మరింత డేంజరస్గా కనిపిస్తోంది. రోజురోజుకూ మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. వైద్య బృందాలు సైతం కరోనా పట్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రీసెంట్గా కరోనా బారిన పడిన ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కోవిడ్ పాజిటివ్ అని నిర్దారణ కావడంతో ఇటీవలే ఆయన ముంబైలోని రహేజా హాస్పిటల్లో చేరారు. కొద్దిరోజులుగా ఆయనను కరోనా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ప్రస్తుతం ఆయన మృత్యువుతో పోరాటం చేస్తున్నట్లు సమాచారం. కరోనాతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి ఆందోళనకరంగా మారిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం హాస్పిటల్లో వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రవణ్ కుమార్ రాథోడ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయన కోలుకొని తిరిగి సాధారణ స్థితికి రావాలని ప్రార్థిస్తున్నారు. మరో మ్యూజిక్ డైరెక్టర్ నదీమ్తో కలిసి అప్పట్లో చాలా సినిమాలకు మ్యూజిక్ అందించారు శ్రవణ్ కుమార్ రాథోడ్. నదీమ్- శ్రవణ్ జంట బాణీలు కట్టిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 1990 నుంచి 2000 మధ్యకాలంలో సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది ఈ జంట . ఆషీకీ, సాజన్, సడక్, దీవానా, దిల్ హైకీ మాంతా నహీ, హమ్ హై రాహీ ప్యార్ కే, ఫూల్ ఔర్ కాంటే, పర్దేశ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఘనత ఈ జోడీది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gjchOW
No comments:
Post a Comment