వెండితెరపై కొన్ని జోడీలకు భలే డిమాండ్ ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా అదే కెమిస్ట్రీ రిపీట్ కావాలని కోరుకుంటారు ఆడియన్స్. దర్శకనిర్మాతలు సైతం అలాంటి జోడీలతో హిట్స్ పట్టేసేందుకు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకొస్తుండటం చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి ఫేమ్ కేవలం ఒకే ఒక్క సినిమాతో కొట్టేసింది 'ఉప్పెన' జోడీ. వైష్ణవ్ తేజ్- జంటగా సిల్వర్ స్క్రీన్పై తెలుగు ప్రేక్షకులకు రొమాంటిక్ కిక్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరికీ వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. మెగా మేనల్లుడిగా, సాయి ధరమ్ తేజ్ సోదరుడిగా మొదటి సినిమాతోనే పాపులారిటీ కూడగట్టుకున్నాడు . ఆయన నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నాయి. హీరోయిన్ కృతి శెట్టి సైతం తొలి సినిమానే అయినా తనదైన లుక్స్, నటనా ప్రతిభతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకుంది. ఇక ఈ ఇద్దరూ పండించిన రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ జోడీతో మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడట ఓ నూతన దర్శకుడు. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా 'ఉప్పెన'తో భారీ హిట్ అందుకున్నారు. వైష్ణవ్ తేజ్- కృతి శెట్టిలను వెండితెరపై మెరిపించారు. దీంతో ఇప్పుడు అదే జోడీతో సుకుమార్ మరో శిష్యుడు రంగంలోకి దిగబోతున్నాడని తెలుస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్- కృతి శెట్టిలతో రెట్టింపు డోస్ రొమాన్స్ పండించబోతున్నారాట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. తనకు హిట్ ఇచ్చిన హీరో వైష్ణవ్తో మరో సినిమా అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసిందట కృతి శెట్టి. సో.. ఇదే నిజమైతే ఈ జోడీకి ఇప్పటికే ఉన్న పాపులారిటీ అమాంతం పెరగడం ఖాయమే మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q1ehRf
No comments:
Post a Comment