ఐకాన్ స్టార్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై బన్ని చాలా ఆశలనే పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టు సినిమా కోసం ఓ రేంజ్లో కష్టపడుతున్నాడు. సినిమా ఇప్పుడు రెండు భాగాలుగా రాబోతుంది. ముందుగా సుక్కు ది రైజ్ అనే టైటిల్తో తొలి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. సినిమా లేటెస్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మారేడుమిల్లికి చేరుకుంది. ఈ సినిమా ఇది వరకే అక్కడ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అక్కడ షూటింగ్ జరిగే సమయంలోనే పుష్ప టీమ్ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ను ఆపేసి వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ వెళ్లారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు మారేడుమిల్లిలోనే చిత్రీకరణను జరుపుతారట. తర్వాత హైదరాబాద్లో ఓ షెడ్యూల్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. ఇది వరకే సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో బన్ని కనిపించబోతున్నారు. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియాతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్ని, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన బన్ని క్యారెక్టర్ ప్రోమో, దాక్కోదాక్కో మేక సాంగ్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X25rWC
No comments:
Post a Comment