ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, అటు బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు చేతినిండా అవకాశాలున్నాయి. ఎన్ని అవకాశాలంటే మిడ్ రేంజ్ హీరోలతో కూడా నటించలేకపోవడం. నిజమేనని, ఆమె డైరీలో దాదాపు రెండేళ్ల వరకు డేట్స్ లేవని సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. రీసెంట్గా నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్గా నటించాలని అప్రోచ్ అయ్యారట. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కూడా డేట్స్ ఖాళీ లేవంటూ నో చెప్పేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీస్ట్ సినిమాలో నటిస్తోన్న పూజా హెగ్డే.. మహేశ్- త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే పవన్కళ్యాణ్, హరీశ్ శంకర్ మూవీ భవదీయుడు భగత్సింగ్ సినిమాలోనూ పేరే వినిపిస్తోంది. బాలీవుడ్లో సల్మాన్ఖాన్ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తుంది. దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్ రేంజ్కు చేరుకున్న పూజా హెగ్డే ఇది వరకు వరుణ్తేజ్, అఖిల్ అక్కినేని చిత్రాల్లో నటించింది. కానీ ఇప్పుడు నటించేందుకు వీలు కుదరడం లేదు. ఈ ఏడాది ప్రభాస్తో పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. రణ్వీర్ సింగ్తో చేస్తున్న సర్కస్ షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవిఆచార్యలో కీలక పాత్రలో నటించిన చరణ్కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్తో బీస్ట్ సినిమాలో నటిస్తుంది. ఇది కూడా షూటింగ్ జరుపుకుంటోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3As9aeR
No comments:
Post a Comment