సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అనారోగ్యంతో ఈరోజు(మంగళవారం) ఉదయం చెన్నైలోని తన ఇంట్లో కన్నుమూశారు. ఆయన వయసు 84 సంత్సరాలు. ఎన్నో చిత్రాలకు చక్కటి పోస్టర్స్ను తయారు చేసి పబ్లిసిటీ డిజైనర్గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. బాపు దర్శకత్వంలో రూపొందిన సాక్షి సినిమాతో పబ్లిసిటీ పనులు స్టార్ట్ చేశారు. ఈ సినిమా కలర్ పోస్టర్స్, లోగోను ఈశ్వర్ రూపొందించారు. నైఫ్ వర్క్తో పోస్టర్స్ను రూపకల్పన చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈశ్వర్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. వంశ పారపర్యంగా వస్తున్న బొమ్మలు గీసే వృత్తిలోకి ఆయన ప్రవేశించారు. బొమ్మలు గీయడంలో ఉండే ఆసక్తితో కాకినాడ పాలిటెక్నిక్ చదువును ఆపేశారు. పబ్లిసిటీ ఆర్టిస్ట్గా స్థిరపడాలనే స్నేహితుడు సహాయంతో మద్రాసు చేరుకున్నారు. మద్రాసు చేరుకున్న తర్వాత కేతా వద్ద పోస్టర్ డిజైనింగ్లో మెళుకువలు నేర్చుకున్నారు. తన పేరు ఈశ్వర్తోనే పబ్లిసిటీ కంపెనీని స్టార్ట్ చేశారు. సినిమా పోస్టర్ సహా పబ్లిసిటీ డిజైనింగ్కు సంబంధించి పలు పుస్తకాలను రచించారు ఈశ్వర్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XDPgPy
No comments:
Post a Comment