మాస్ మహారాజ్ ఇమేజ్ రెట్టింపు చేసిన సినిమా 'విక్రమార్కుడు' అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కెరీర్లోని బెస్ట్ సినిమాల్లో ఈ మూవీ ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించారు. మాస్ ఆడియన్స్ చేత థియేటర్స్లో ఈలలు వేయించి గత రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డ్స్ లిఖించారు. పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్గా ఆయన నటన విమర్శకుల ప్రశంసలందుకుంది. అయితే ఇన్నేళ్లకు మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ రానుందని తెలుస్తుండటం రవితేజ అభిమానులను హుషారెత్తిస్తోంది. 2006 సంవత్సరం విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించిన 'విక్రమార్కుడు' కథకు మళ్లీ ఇంతకాలానికి సీక్వెల్ కథ రెడీ చేశారట రచయిత విజయేంద్ర ప్రసాద్. అంతకుమించి అన్నట్టుగా ఈ కథ వచ్చిందని అంటున్నారు. కాకపోతే ఈ సీక్వల్కి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు లేవని అంటున్నారు. మరో రెండు మూడేళ్ల వరకూ తన సినిమాలతో బిజీ షెడ్యూల్లో ఉన్నారట జక్కన్న. దీంతో విజయేంద్ర ప్రసాద్ ఈ కథను వేరే దర్శకుడికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా కథ రాసుకున్న ఆయన రవితేజ సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో కొన్ని అభిప్రాయాలతో ఉన్నారట. అప్పుడు 'విక్రమార్కుడు' సినిమాలో అనుష్క కుర్రకారును ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అనుష్క డేట్స్ ఇస్తే ఆమెనే ఫైనల్ చేయాలని, లేదంటే ఓ బాలీవుడ్ బ్యూటీని దించాలని ఈ మూవీ రూపొందించనున్న డైరెక్టర్కి సూచించనున్నారట విజయేంద్ర ప్రసాద్. ఇకపోతే ఈ '' సినిమాను డైరెక్ట్ చేయబోయే దర్శకుల లిస్టులో వీవీ వినాయక్, పూరి జగన్నాధ్, సురేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సో.. చూడాలి మరి ఏం జరుగుతుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3An0kPi
No comments:
Post a Comment