మెగా పవర్ స్టార్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్కు బ్రాండ్ అంబాసిడర్గా మారిన సంగతి తెలిసిందే. శనివారం నాటి షోలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా రామ్ చరణ్ మీద షూట్ చేసిన యాడ్ ప్రోమో అదిరిపోయింది. నాగార్జునతో కలిసి బిగ్ బాస్ స్టేజ్ మీద చెర్రీ సందడి చేశాడు. ఇదే క్రమంలో నాగార్జున, రామ్ చరణ్ కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం, ఆ ప్రోమోలో షో మ్యాన్లా రామ్ చరణ్ అదరగొట్టడంపై నాగార్జున కితాబిచ్చాడు. ఇక అదే సమయంలో హెల్త్ అప్డేట్ గురించి రామ్ చరణ్ను నాగార్జున అడిగాడు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు.. కోలుకుంటున్నాడు.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని రామ్ చరణ్ అన్నాడు. ఆ దేవుడి దయ వల్ల సాయి ధరమ్ తేజ్ త్వరగానే కోలుకుంటాడు అని నాగార్జున కూడా అన్నాడు. గత శుక్రవారం రాత్రి సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అలా మొత్తానికి బిగ్ బాస్ వేదిక మీదుగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక రామ్ చరణ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అంబాసిడర్గా మారడంతో కాసేపు బిగ్ బాస్ స్టేజ్ను ఆడుకున్నాడు. మాస్ట్రో టీంను స్టేజ్ మీదకు రామ్ చరణ్ పిలిచాడు. తమన్నా, నితిన్, నభా నటేష్లతో మాట్లాడి మాస్ట్రో చిత్ర విశేషాలను ప్రేక్షకులకు తెలిసేలా రామ్ చరణ్ చేశాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XFfzoL
No comments:
Post a Comment