మొదటి సినిమా 'అ!' తోనే తనలోని విలక్షణతను చాటుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన మూడో సినిమాగా విభిన్న తరహాలో 'జాంబీ రెడ్డి' సినిమా రూపొందించిన ఆయన ఈ చిత్ర అప్డేట్స్తో సినిమాపై ఆతృత పెంచేస్తున్నారు. ఈ సినిమా టీజర్, పోస్టర్లను స్టార్ హీరోయిన్ సమంత, నిర్మాత దిల్ రాజు ఇటీవలే విడుదల చేయగా భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక తాజాగా జాంబిరెడ్డి బిగ్ బైట్ ట్రైలర్ను విడుదల చేశారు. 'కరోనా వైరస్ బ్యాడ్ అయితే, దాని డాడ్ ఎవరో చెప్పగలరా' అంటూ విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. 2 నిమిషాల 48 సెకనుల నిడివితో ప్రతి సన్నివేశం కొత్తగా అనిపిస్తోంది. జాంబీలు మనుషులపై చేస్తున్న దాడి, హర్రర్ ఎలిమెంట్స్కి కామెడీ జోడించి వినూత్నంగా ఈ సినిమా రూపొందించారని అర్థమవుతోంది. ఇప్పటిదాకా హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే పరిమితమైన 'జాంబి' జానర్ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. తెలుగులో ఇది మొట్టమొదటి జాంబీ ఫిల్మ్ కావడం విశేషం. ఈ చిత్రంలో తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో నటించగా.. రఘుబాబు, పృథ్వీ రాజ్, గెటప్ శ్రీను, కిరీటి, హరితేజ, అన్నపూర్ణమ్మ ముఖ్య పాత్రలు పోషించారు. కె. రాబిన్ సంగీతం అందించగా రాజశేఖర వర్మ నిర్మాతగా వ్యవహరించారు. రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సో.. చూడాలి మరి ఈ జానర్ తెలుగు ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JC8A8W
No comments:
Post a Comment