టాలీవుడ్ క్రేజీ సెలబ్రిటీ జోడీల్లో ఒకటి మహేష్ బాబు- జంట. దాదాపు 15 ఏళ్ల క్రిందట ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నేటికీ నవ దంపతుల్లా ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా కొడుకు, కూతురుతో కలిసి ఫారెన్ లొకేషన్స్కి వెకేషన్ ట్రిప్స్ వేస్తూ సరదాగా గడుపుతుంటారు నమ్రత మహేష్. కాగా ఈ రోజు (జనవరి 22) మహేష్ సతీమణి నమ్రత పుట్టినరోజు కావడంతో ఇది తనకు ఎంతో స్పెషల్ డే అంటూ ట్వీట్ చేశారు. జనవరి 22వ తేదీ 1972 సంవత్సరంలో జన్మించిన నమ్రత.. నేడు తన 49వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ తన భార్య నమ్రతపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు మహేష్ బాబు. ''నేను ఎంతగానో ప్రేమించే ఆ వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ప్రతిరోజు నీతో గడపడం ప్రత్యేకమైనదే.. కానీ ఈ రోజు అది మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు. ప్రేమతో.. పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్'' అని ట్వీట్ చేస్తూ ఆమెతో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన ఫొటో జత చేశారు మహేష్. తన సతీమణి నమ్రతకు మహేష్ బాబు చెప్పిన విషెస్, ఆయన పంచుకున్న ఆ ఫొటో చూసి ఫిదా అవుతున్న మహేష్ ఫ్యాన్స్ నమ్రతకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా నమ్రత పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ పోస్ట్ చేస్తుండటంతో సోషల్ మీడియా అంతా ఆమె బర్త్ డే పోస్టులతో హోరెత్తిపోతోంది. ప్రస్తుతం మహేష్ బాబు, నమ్రత సహా ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార దుబాయ్లో ఉన్నారు. మహేష్ లేటెస్ట్ మూవీ '' ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నిమిత్తం దుబాయ్ వెళ్లిన మహేష్.. అక్కడే తన భార్య నమ్రత పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేయబోతున్నారు. పుట్టినరోజు వేడుకల అనంతరం నమ్రతా శిరోద్కర్ సహా గౌతమ్, సితార హైదరాబాద్కు తిరిగి రానున్నారని.. మహేష్ బాబు మాత్రం అక్కడే నెల రోజుల పాటు ‘సర్కారు వారి పాట’ షూటింగ్లో పాల్గొననున్నారని సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39W4D87
No comments:
Post a Comment