సినీ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ కావడం మొదలు ఈ ఇష్యూపై ఎన్నో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. పలువురు సినీ నటులపై అనుమానాలు రావడం, వారందరినీ పోలీసులు విచారించడం లాంటివి జరిగాయి. ఆ తర్వాత రాజ్ కుంద్రా బెయిల్ మీద బయటకొచ్చాడు. మరోవైపు రాజ్ కుంద్రా తనను లైంగికంగా వేధించాడని, తనని బెదిరించి తనపై అశ్లీల చిత్రాల షూటింగ్ చేశాడని చెప్పిన హాట్ బ్యూటీ .. రాజ్ కుంద్రా విడుదల తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దీంతో ఈ ఇష్యూపై దంపతులు రియాక్ట్ అవుతూ ముందడుగేశారు. తమ పరువుకు భంగం కలిగించేలా షెర్లిన్ వ్యహరించిందంటూ న్యాయపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు ఆమెపై 50 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని, తమకు జరిగిన పరువు నష్టానికి 50 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసులు పంపించారు. ఈ విషయమై శిల్పా శెట్టి దంపతుల తరపు న్యాయవాది మాట్లాడుతూ.. షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అవాస్తవం అని అన్నారు. వారిని ఇలా కించపరిచి, డబ్బులు డిమాండ్ చేసేందుకే ఆమె ఆరోపణలు చేశారని తెలిపారు. షెర్లిన్ పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియా దృష్టిని ఆకర్షించడానికి షెర్లిన్ ప్రయత్నిస్తుందని ఆయన చెప్పారు. దీంతో మరోసారి షెర్లిన్- రాజ్ కుంద్రా వ్యవహారం బీటౌన్లో హాట్ టాపిక్ అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pk9No2
No comments:
Post a Comment