గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సారి జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ఎన్నికలకు ముందు నుంచే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య పేలిన మాటల తూటాలు, ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. నాటకీయ పరిణామాల నడుమ ముగిసిన ఈ ఎన్నికల్లో చివరకు మంచు విష్ణు విజయకేతనం ఎగురవేశారు. MAA నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు ఫోన్ చేసి కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. MAA ఎన్నిక నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రకాష్ రాజ్ దూకుడుగా వ్యవహరించారు. తన ప్యానల్ వివరాలు ప్రకటించి అప్పటినుంచే ఎన్నికల గురించి మాట్లాడటం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మంచు విష్ణు ఎంటర్ కావడంతో వాతావరణం మరింత వేడిక్కింది. మంచు విష్ణు Vs ప్రకాష్ రాజా అన్నట్లుగా సీన్ క్రియేట్ అయింది. అయితే ఆ సమయంలో ప్రకాష్ రాజ్కి మెగాస్టార్ మద్దతు బలంగా ఉందనే టాక్ నడిచిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ తరఫున స్వయంగా బరిలోకి దిగిన మెగాబ్రదర్ నాగబాబు.. ఆయనకు తన బలమైన సపోర్ట్ అందిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే అన్నయ్య మెగాస్టార్ మద్దతు ఆయనకే అన్నట్లుగా చెప్పుకొచ్చారు. మరోవైపు తనను అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోమని మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్ చేశారని విష్ణు మంచు వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో 'మా' రిజల్ట్ అనంతరం ఈ ఎన్నికలు మోహన్బాబు, చిరంజీవి మధ్య చిచ్చు పెట్టాయనే పుకార్లు బయటకొచ్చాయి. ఈ పరిణామాల నడుమ తాజాగా చిరంజీవి స్వయంగా మోహన్ బాబుకు ఫోన్ చేసి.. 'మా' ఎన్నికలు, తన మద్దతు విషయమై పూర్తి క్లారిటీ ఇచ్చారని తెలుస్తుండటం మరోసారి చర్చల్లో నిలిచింది. మోహన్ బాబుకు కాల్ చేసిన చిరు.. తాను ఎవ్వరికీ మద్దతు ఇవ్వలేదని, తన ప్రమేయం లేకుండానే తన పేరు బయటికి వచ్చిందని చెప్పునట్లు సమాచారం. ఎప్పటిలాగానే మన మధ్య ఉన్న స్నేహబంధం కొనసాగుతుందని అన్నారట చిరు. దీనిపై మోహన్ బాబు సైతం స్నేహపూర్వకంగా రియాక్ట్ అయ్యారని, అందరం కలసికట్టుగా ఉండాలనేది తన అభిప్రాయమని చిరంజీవికి చెప్పినట్లు తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aLKsuv
No comments:
Post a Comment