లేటెస్ట్గా యాక్ట్ చేస్తున్న మూవీ ‘గాడ్ ఫాదర్’. మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు ఇది రీమేక్. రీసెంట్గానే ఊటీలో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రారంభించే క్రమంలో, కథను తయారు చేయడానికి చాలా కసరత్తులే చేశారు. ముందు సుజిత్ను దర్శకుడిగా అనుకున్నారు. తను తెలుగు వెర్షన్కు తగ్గట్లు, చిరంజీవి ఇమేజ్కు తగ్గట్లు కథలో చేసిన మార్పులు నచ్చకపోవడంతో, వి.వి.వినాయక్ రంగంలోకి దిగాడు. చివరకు కథలో ఆయన కూడా చేసిన మార్పులు మెగాస్టార్కు నచ్చలేదు. చివరకు కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకుడిగా ఖరారు అయ్యారు. ‘గాడ్ ఫాదర్’ కథ విషయంలో దర్శకుడు మోహన్ రాజాకు పూరీ జగన్నాథ్ తన వంతు సపోర్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. చిరు ఇమేజ్కు తగ్గట్లు కథలో ఎలాంటి మార్పులు చేయాలనే విషయంలో డైరెక్టర్కు మోహన్రాజాకు పూరీ సలహాలు ఇచ్చారట. హీరోలను మాస్ ఇమేజ్లో సిల్వర్ స్క్రీన్పై ప్రెజంట్ చేయడంలో పూరికి ఓ ప్రత్యేకత ఉంది. అందువల్ల పూరి ఇచ్చిన సలహాలు పాటిస్తూ మోహన్ రాజా సన్నివేశాలను యాడ్ చేసుకుని స్క్రిప్ట్లో మార్పులు, చేర్పులు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి చిరంజీవి రాజకీయాల నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు పూరీ జగన్నాథ్తో చిరంజీవి సినిమా చేయాల్సింది. ఆటో జానీ.. పేరుతో చిరంజీవి కోసం పూరి కథను తయారు చేశాడు. అయితే సెకండాఫ్ నచ్చకపోవడంతో ఆ సినిమా ఆటకెక్కింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సత్యదేవ్ గ్రేషేడ్స్ ఉన్న కీలక పాత్రను పోషించనున్నారు. మరో వైపు చిరంజీవి ఆచార్య విడుదలకు సిద్ధమవుతుంది. భోళాశంకర్ మూవీ సెట్స్పైకి వెళ్లనుంది. అలాగే బాబి దర్శకత్వంలో మరో సినిమాను చేయడానికి చిరు రెడీగా ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mmKlLd
No comments:
Post a Comment