మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఒకరి మీద మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ప్యానెల్ మీడియా ముందుకు వచ్చింది. ప్రకాష్ రాజ్ మంచు ఫ్యామిలీ మీద, నరేష్ మీద, ఇండస్ట్రీ పెద్దల మీద సంచలన కామెంట్స్ చేశాడు. తనకు సినీ పెద్దల ఆశీర్వాదం అవసరం లేదని అందరి ముందే చెప్పాడు. ఆ పెద్దోళ్లనే ప్రశ్నించే వాడు కావాలి.. అంటూ తన గురించి తాను చెప్పేసుకున్నాడు. ప్యానెల్ కావాలా? మంచి ప్యానెల్ కావాలా? అంటూ ప్రాసలతో ప్రకాష్ రాజ్ తన ప్రసంగాన్ని ముందుకు కొనసాగించాడు. నాకు తెలుగు వచ్చినంతగా ఎవ్వరికీ రాదు. నేను తెలుగు మాట్లాడుతుంటే.. తెలుగు తల్లే గర్వపడుతుంది. నేను అంతగా తెలుగును ప్రేమిస్తాను. నేను మాట్లాడినంత అనర్గళంగా మీలో ఎవ్వరూ మాట్లాడలేరు. మా ఎన్నికల గురించి మాట్లాడమంటే.. నరనరాల్లో నటన ఉందని అంటారు. నటన ఉండాల్సింది నరాల్లో కాదు. మొహంలో. నరాల్లో రక్తం, రక్తకణాలు ఉంటాయని మంచు విష్ణు మీద సెటైర్లు వేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ అయితే స్టూడియో లోపలకి వదలరా? ఈ ప్యానల్ వచ్చాక.. ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద స్టూడియో అయినా సరే వదిలితీరాలి. అక్కడ హీరోలు, డైరెక్టర్లు కనిపిస్తే అడిగే హక్కు మాకుంది. ఇది మా ఇండస్ట్రీ. వదిలి తీరాలి. ఆ గర్వాన్ని తీసుకొస్తా. మేం అడుక్కోవడం లేదు. అది మా హక్కు. దాదాగిరి చేస్తాను.. దాదాగిరి నిజంగానే చేస్తాను. ఒకరు అడిగారు.. సినీ పెద్దల ఆశీర్వాదం ఉందా? అని.. నాకు లేదు.. వ్దదు.. నా సత్తాతో గెలుస్తా. ఎందుకంటే ఆ పెద్దోళ్లను సైతం ప్రశ్నించే వాళ్లే కావాలి అంటూ ప్రసంగానికి మసాలా అంటించాడు. ఇక నరేష్ మీద కూడా సెటైర్లు వేశాడు. రథం, రథసారథి అని అంటున్నాడు. ఆయన చక్రం ఎప్పుడో కొట్టేశాం, అక్కడ ఏం లేదు అని ప్రకాష్ రాజ్ కౌంటర్లు వేశాడు. నరేష్ మాట్లాడేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ప్రకాష్ రాజ్ చురకలు అంటించాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BkHAAk
No comments:
Post a Comment